మూడో సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని, అక్కినేని అభిమానులని సంతోషపరచాలని చూస్తున్న హీరో అఖిల్. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నోడు, మొదటి రెండు చిత్రాలతో దారుణమైన రిజల్ట్ ఫేస్ చేశాడు. దీని నుంచి ఎలా అయినా బయటపడాలని, హిట్ ట్రాక్ ఎక్కాలని భావించిన అఖిల్ అక్కినేని… రిపబ్లిక్ డే కానుకగా మిస్టర్ మజ్ను సినిమాని ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలిప్రేమ తరహాలోనే క్లీన్ హిట్ కొట్టొచ్చని సినీ అభిమానులు అనుకుంటున్నారు. టీజర్ తో మెప్పించిన ఈ లేటెస్ట్ మజ్ను, ట్రైలర్ తో మాత్రం ఆరెంజ్ సినిమాని గుర్తు చేశాడు. మొదట్లో అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే హీరో తర్వాత హీరోయిన్ తో నిజమైన ప్రేమలో పడటం అనేదే మజ్ను పాయింట్ లా కనిపిస్తుంది. ఇందులో కొత్తదనం లేదు. అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ప్రేమ్ నగర్ తో మొదలుపెడితే నాగార్జున మజ్ను సినిమా వరకూ మనం చుసిన కథలన్నీ ఇవే.
అయితే సరిగ్గా చూపించాలే కానీ ప్లే బాయ్ పాత్రలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతారు, అదే ప్లస్ పాయింట్ గా చేసుకొని ప్రొమోషన్స్ జరుపుకుంటున్న మిస్టర్ మజ్ను సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు/ఏ’ సర్టిఫికేట్ రాబట్టిన ఈ సినిమా సెంటిమెంట్ పరంగా చూస్తే తాత ఏఎన్ఆర్ లైలా మజ్ను చేసి హిట్ కొడితే, నాన్న నాగార్జున కూడా మజ్ను చేసి బంపర్ హిట్ అందుకున్నాడు. ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ మూడో తరం మజ్ను కూడా హిట్ అందుకుంటాడని అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు. తెలుగులో పెద్దగా పోటీ లేకపోవడం అఖిల్ కి బాగా కలిసొచ్చే అంశం, మరి కెరీర్ లో ఫస్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అక్కినేని వారసుడు, ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ లాంటి టైటిల్ అయినా మజ్నుతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!