లలిత్ మోడీ, గౌతమ్చంద్ రాథోర్ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ’నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్బస్టర్హిట్ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. రెండు కుక్కలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. హీరో శ్రీరామ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. జనవరి 3న ఈ చిత్రం డుదలవుతున్న సందర్భంగా..హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో కె.సి. బొకాడియ మాట్లాడుతూ “అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్, అక్షయ్కుమార్, అజయ్దేవగన్, సన్నీదేవన్, సైఫ్ వాళ్ళూ ఖాన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి, జయప్రద, ఇలా 100కు పైగా స్టార్ హీరోలతో, స్టార్ హీరోయిన్లతో వర్క్ చేశాను. అతి తక్కువ సమయంలో 50 సినిమాలు తీసిన నిర్మాతను. నా మొదటి సినిమాకే అమితాబ్ బచ్చన్ ని డైరెక్ట్ చేయడం మర్చిపోలేను. మధ్యలో కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ’నమస్తే నేస్తమాౠ తో ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే..రెండు కుక్క పిల్లలు చిన్నప్పుడే విడిపోయి ఒకటి పోలీసుల దగ్గర, మరోటి దొంగల దగ్గర పెరుగుతాయి. శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. అతను హత్యకు గురవుతాడు. ఈ రెండు కుక్కపిల్లలు కలిసి బాస్ని చంపిన వాళ్ల మీద ఎలా పగ తీర్చుకున్నాయి అనేదే కథ. దాదాపు 100 రోజులు ఆ డాగ్స్ తో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాలీవు్డ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి రెండు పాటలు కంపోజ్ చేశారు. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి” అన్నారు.
previous post
next post