“RRR” విజయంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. దీంతో ఇప్పుడు తారక్ ఒప్పుకుంటున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. ప్రస్తుతం తారక్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా ఆ తర్వాత ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సన్న దర్శకుల సినిమాలు. అయితే వీటన్నిటిలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుని ఎన్టీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. “కేజిఎఫ్” రెండు భాగాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు ప్రశాంత్ నీల్ క్రియేట్ చేయడంతో.. తారక్ .. ఈ ప్రాజెక్టు కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
NTR 31: ఆ సినిమా టార్గెట్ గా ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ప్రశాంత్ నీల్..??
ఈ నేపథ్యంలో కెరియర్ లో ఫస్ట్ టైం ఒకేసారి రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట. మామూలుగా అయితే ఎన్టీఆర్ ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరోదాన్ని స్టార్ట్ చేస్తారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ముందుగానే రెండు సినిమాల షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మేటర్ లోకి వెళ్తే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఆల్ రేడీ ఇప్పటికే స్టార్ట్ కావలసి ఉంది. అయితే స్టోరీలో మార్పులు చేసే పరిస్థితి ఏర్పడటంతో ఆలస్యం అవుతూ ఉంది. ఈ పరిణామంతో ఎన్టీఆర్ మరోపక్క బుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా.. కొరటాల ప్రాజెక్టుతో కలిపి చేయాలని డిసైడ్ అయ్యారట. దీంతో రెండు ప్రాజెక్టులను అక్టోబర్ నెల నుండి స్టార్ట్ చేయాలని ఈ లోపు బుచ్చిబాబుని ఫైనల్ స్క్రిప్ రెడీ చేయాలని తారక్ ఆదేశాలు జారీ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.
ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత.. మొత్తం దృష్టి అంతా ప్రశాంత్ నీల్ సినిమాపై పెట్టాలని తారక్ ఫుల్ క్లారిటీతో ఉన్నారంట. దీంతో వచ్చే ఏడాది తారక్ నుండి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో తారక్ పుట్టినరోజు నాడు ప్రశాంత్ నీల్… సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఉరా మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించడంతో.. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.