Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలం విరామం తర్వాత తిరిగి సినిమాలు మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ మొదటగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా, ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.
మహేష్ బాబు ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు మూడేళ్ళ క్రితం కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. ఈ మాల్ జంటనగరాలలో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మల్టీ ప్లెక్స్ లో మొత్తం 7 స్క్రీన్ లు ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం మహేష్ బాబు ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లో ఉన్న మొత్తం 7 స్క్రీన్లలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రదర్శితం కాబోతోంది.
రికార్డ్ క్రియేట్ చేసిన వకీల్ సాబ్:
మహేష్ బాబు ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా కేవలం నిమిషాల వ్యవధిలోనే 7 స్క్రీన్లు హౌస్ ఫుల్ కావడం మరొక విశేషం. ఈ సినిమా ఫస్ట్ డే మొత్తం 27 షోలను వేయగా అన్ని హౌస్ ఫుల్ కావటంతో పవన్ కళ్యాణ్ సినిమాకు ఏస్థాయిలో బజ్ ఉందో అర్థమవుతుంది.ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో గత మూడు సంవత్సరాల నుంచి ఇటువంటి రికార్డ్ ఎప్పుడూ లేదని… ఇంత అద్భుతమైన రికార్డ్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సృష్టించిందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్లలో మొదటి రోజు అన్ని షోలు హౌస్ ఫుల్ కాగా, మిగిలిన రెండు రోజులు 80% టికెట్లు బుక్ కావడం విశేషం. చాలా కాలం తర్వాత ఈ శుక్రవారం పవర్ స్టార్ స్టామినా ఏమిటో మరోసారి ప్రేక్షకులకు చూపించబోతున్నారు.