Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస రీమేక్ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఈయన నుంచి చివరగా వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ రీమేక్ చిత్రాలే. పైగా రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. అయితే ఇప్పుడు పవన్ కన్ను మరో రీమేక్పై పడింది. అదే `వినోదయ సీతం`. గత ఏడాది తమిళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
సముద్రఖని ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా.. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తంబి రామయ్య మరో కీలక పాత్రలో నటించాడు. అయితే ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో రీమేక్ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడట.
అలాగే ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన స్టైల్లో మార్పులు చేస్తుండగా.. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనినే తెలుగులోనూ తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ఇక ఏప్రిల్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు పవన్ అందుకోబోయే రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పవన్ `వినోదయ సీతం` రీమేక్ కోసం 20 రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడట. అయితే ఆ ఇరవై రోజులకే పవన్ ఏకంగా రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో 20 రోజులకే అన్ని కోట్ల రెమ్యునరేషనా..పవన్ మామూలోడు కాదు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.