బుల్లితెర చరిత్ర లో ఢీ డాన్స్ షో ప్రస్థానం చాలా గొప్పది. ఈ వేదిక సాక్షిగా ఎంతో మంది డాన్సర్లు వెలుగులోకి వచ్చారు. బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్, రఘు, జానీ ఇలా ఎంతో మంది ఇక్కడినుండే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. వారిలో చాలామంది ఏకంగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఒకప్పుడు ఢీ అంటే కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు ఇందులో ఎంటటైన్మెంట్ కు పెద్ద పీట వేశారు. దీనిని ఒక కామెడీ షోగా మార్చేశారు.
ఇదే క్రమంలో ప్రదీప్, సుధీర్, రేష్మి, హైపర్ ఆది, వర్షిని అంతా కలిసి నానా రచ్చ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ప్రదీప్ అందరితో కలిసి వేరే లెవెల్ లో హంగామా చేస్తుంటాడు. వీరికి తోడు జడ్జీలు కూడా జడ్జిమెంట్ కన్నా కూడా ఈ కామెడీ స్కిట్లు కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రవర్తిస్తారు. శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ ల అల్లరి మరో రకంగా ఉంటుంది. మాస్టర్ ని పులిహోర కలుపుతాడు అని అందరూ ఎగతాళి చేస్తారు.
తాజాగా ప్రదీప్ పూర్ణ ట్రాక్ కూడా మొదలు పెట్టేశారు. ఇక ఇదే సమయంలో పూర్ణ గతంలో తన తోటి జడ్జిలు ఎలా వుంటారు…. ఎలా ప్రవర్తిస్తారో ఇమిటేట్ చేసి చూపించింది. శేఖర్ మాస్టర్ ను అయితే అచ్చు గుద్దినట్లు దించేసింది. ఇదే క్రమంలో ఆమె హైపర్ ఆది లా కూడా నటించింది.
ముఖ్యంగా డాన్స్ చేస్తున్నప్పుడు అతను ఎలా లేడీ డాన్సర్లను తీక్షణంగా చూస్తాడు…. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అని చేసి చూపించింది. అతను చేసే పనులు కి తను షాక్ అవుతున్నట్లు చెప్పింది. దీంతో అందరూ పగలబడి నవ్వారు. పూర్ణ అలా హైపర్ ఆది లా యాక్ట్ చేసి ఇతనికి ఇంత కక్కుర్తి ఉందా అన్న అనుమానం వచ్చేలా చేసింది.