Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా పీరియాడికల్ రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఆశించిన సక్సెస్ అందుకోవడంలో డార్లింగ్ రాంగ్ స్టెప్ వేశాడు. అందుకే ఇక నుంచి రాబోయే సినిమాల మీద గట్టిగా ఫోకస్ పెట్టాలని డిసైడయ్యాడు. ఈ కారణంగానే టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీకి ఛాన్స్ ఇచ్చాడు. అయితే, ప్రభాస్ మారుతి సినిమా రాంగ్ స్టేట్మెంట్ అని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మారుతి సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెడీ అవుతున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలుచోట్ల సెట్ వర్క్ జరుగుతోందట. ఈ సెట్స్ లోనే ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్ జరగనుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ జస్ట్ రెండు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చాడు. ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాలో ఉంటారని..వారిలో ఇప్పటికే మలయాళ భామ మాళవిక మోహన్, మెహ్రీన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
Prabhas: మీడియం బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే, ఈ ప్రాజెక్ట్ను ప్రభాస్ ఇటీవల రిలీజైన రాధేశ్యామ్ రిజల్ట్ చూసిన తర్వాతే చేయాలని డిసైడయ్యాడట. దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ‘రాధేశ్యామ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ఓ చిన్న సినిమాను తక్కువ బడ్జెట్తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వరుసగా ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.