Prabhas: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. సాహో అనంతరం ప్రభాస్ మళ్లీ స్క్రీన్ పై కనబడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. దాదాపు రెండేళ్లుగా అతని ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన విషయం విదితమే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
Salaar: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..ఆగిపోయిందనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు
Prabhas: రాధే శ్యామ్ వచ్చేది థియేటర్లలోనే.?
కాగా ఈ మూవీ ఈ జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వలన కాస్త ఆలస్యమయ్యింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ తాజాగా సోషల్ మీడియాలో టాక్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఓటీటీ సంస్థలతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్, జీ 5 నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం.
Salaar: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..ఆగిపోయిందనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు
ప్రభాస్ చెబుతున్నది ఇదే..
ఇక ఈ విషయమై వస్తున్న రూమర్స్ పై మన డార్లింగ్ ప్రభాస్ స్పందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్పి… త్వరలోనే రాధేశ్యామ్ థియేటర్లలోకి రాబోతుందంటూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో రాధేశ్యామ్ సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.