Radhe Shyam: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవటంలో కొద్దిగా ట్రాక్ తప్పింది. దీంతో మిక్సీడ్ టాక్ రావడంతో … అభిమానులు ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాదిన్నర టైమ్ తీసుకుని “సాహో” లాంటి ఫ్లాప్ చూసిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా రెండున్నర సంవత్సరాలు గ్యాప్ తీసుకుని “రాధేశ్యాం” లాంటి డిజాస్టర్ చవి చూడటంతో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.
పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సరికొత్త ప్రేమ కథ నేపథ్యంలో విడుదల అయినా గాని.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. ప్రభాస్- పూజ హెగ్డే కలసి డిఫరెంట్ వెస్టర్న్ తరహా ప్రేమ కథ…మూవీ ఇండియా ప్రేక్షకులకు అందించలని దర్శకుడు చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. ముఖ్యంగా స్టోరీ డీలింగ్ చేయటంలో… డైరెక్టర్ రాధాకృష్ణ.. కొద్దిగా మిస్ ఫైర్ అయ్యారు అని… సినిమా చూసిన జనాలు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఆయువుపట్టు నైజాంలో మొట్ట మొదటి రోజు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 10.85 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఐదు షోలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్లు రేట్లు పెరగడం తో మొదటి రోజు “రాధేశ్యాం” రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రభాస్ సినిమా విడుదల అయ్యి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో… డార్లింగ్ అభిమానులు “రాధేశ్యాం” విషయంలో ఫుల్ నిరుత్సాహంగా ఉన్నారు.