దక్షిణాది సినిమా రంగంలో తిరుగులేని హీరోలు కమలహాసన్, రజినీకాంత్. ఇద్దరూ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో లు. రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇక వైవిద్యమైన పాత్రలు చేస్తూ నటనపరంగా భారతదేశంలోనే మంచి గుర్తింపు కలిగిన హీరో కమల్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దక్షిణాదిలో చాలా సినిమాలు తెరకెక్కయి.
నెక్స్ట్ రజనీకాంత్ డైరెక్టర్ తో కమల్ హాసన్..??
ఈ దిశగానే “RRR” తెరకెక్కి రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. చరణ్, తారక్ నటించిన ఈ సినిమా ఇండియాలో 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించటం సంచలనం రేపింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కమలహాసన్ రజనీకాంతులతో మల్టీ స్టార్ సినిమా తెరకెక్కించాలని తమిళ స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేయడం జరిగిందంట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు లోకేష్ కనకగరజ్. ఇటీవల “విక్రం” తెరకెక్కించాడు. కమలహాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో “బాహుబలి” రికార్డులు బ్రేక్ చేసింది.
ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో లోకేష్ కనకగరజ్ వీరిద్దరికీ ఒక స్టోరీ రాసినట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. గతంలో రజిని, కమల్ కలిసి పలు సినిమాలు చేయడం జరిగింది. అయితే మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి చేస్తున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు తెరకకడానికి సంవత్సరం పట్టే అవకాశం ఉందని సమాచారం.