బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో నిరూపమ్, సౌర్యలను ఒక్కటి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రేమ్ వాళ్లిదరిని ఒకే కారులో వచ్చేలా ప్లాన్ చేస్తాడు ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్,సౌర్యఒకే కారులో వెళుతూ ఒకరి గురించి ఎవరి తలుచుకొని మనసులో బాధపడుతూ ఉంటారు.అప్పుడు సౌర్య నేను ఎవరిని మోసం చేయలేదు అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి అని చాలా దైర్యంగా నిరుపమ్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.అప్పుడు వేరే వాళ్లకు కాల్ చేసి మన టైం బాగుంటే అన్ని బాగుంటాయి.ఈరోజు ఆటో డ్రైవర్స్ గా ఉన్న మనం కార్ ఓనర్ గా మారవచ్చు.కారు ఓనర్స్ గా ఉండేవారు డ్రైవర్లు కావచ్చు అని నిరుపమ్ ని ఉద్దేశించి అంటుంది.అలా ఇద్దరు కూడా సౌందర్య ఇంటికి చేరుతారు.కాసేపు అందరు మాట్లాడుకున్న తరువాత నిరుపమ్ సరే ప్రేమ్ వెళ్దాం పద అంటాడు.
నిరూపమ్ కు షాక్ ఇచ్చిన సౌర్య:
అప్పుడు సౌర్య ఒక్క నిమిషం ఆగండి డాక్టర్ సాబ్ అని నిరుపమ్ దగ్గరికి వెళ్లి నిరుపమ్ ఇచ్చిన మొబైల్ ఫోన్ ను తిరిగి ఇచ్చేస్తుంది. అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు.ఆ తరువాత సౌందర్య, ఆనంద్ రావ్ లు కార్తీక్,దీపలను తలుచుకొని బాధపడుతూ మళ్ళీ బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటారు.
సౌందర్య ఇంట్లో బోనాల పండగ హడావిడి :
ఇక మరుసటి రోజు ఉదయం సౌందర్యతో పాటు అందరు కలిసి బోనాల పండుగకు అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు.అప్పుడు ప్రేమ్, నిరూపమ్ కూడా వస్తారు.ఎలా అయినా సౌర్య,నిరుపమ్ లను కలపాలి అని శౌర్య,నిరుపమ్ ఇద్దరిని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటాడు. అందరు చాలా సంతోషంగా బోనాలు ఎత్తుకుని గుడికి బయలుదేరతారు. ఇంద్రుడు, చంద్రమ్మ ఇంకా సౌందర్య కుటుంబ సభ్యులు అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.ఆ తర్వాత అందరూ సంతోషంగా హిమ,సౌర్యల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నిరుపమ్, సౌర్య పక్కన నిలబడి నడుస్తూ ఉండగా ప్రేమ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. లంగా ఓణిలో ఉన్న హిమను చూసి ప్రేమ్ ఎంత అందంగా ఉన్నావో హిమ అంటు అనుకుంటూ ఉంటాడు.
హిమకు షాక్ ఇచ్చిన సౌర్య:
ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తారు. పూజారి వచ్చి అమ్మవారి గొప్పతనం గురించి అందరికి అర్ధం అయ్యేలాగా చెబుతాడు. మీరు మనసులో అనుకున్న కోరిక పేపర్ మీద రాసి అమ్మవారి హుండీలో వేస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పగా ఆ ప్రేమ్ పూజారి చెప్పిన విధంగా చీటీలో పేరు రాసి కోరికను కోరుకొని హుండీలో ఆ పేపర్ ని వేయాలి అనుకుంటాడు. అప్పుడు హిమ కూడా సౌర్య కోసం చీటీ వేయాలి అనుకుని ఒకరి తరువాత ఒకరు రాస్తారు. అలాగే సౌర్య కూడా చీటి రాసి హుండీలో వేసి వెళ్ళిపోతుంది.తర్వాత సౌర్య రాసిన చీటీని ఎలాగోలా హిమ చదివి ఒక్కసారిగా షాక్ అవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంతకీ ఆ చీటిలో సౌర్య ఏమి రాసింది అనేది పెద్దా ట్విస్ట్ గా మారింది.