ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలావరకు మల్టీ స్టార్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక మల్టీ స్టార్ సినిమాలు రావటం జరిగాయి. స్టార్ హీరోలు సైతం కుర్ర హీరోలతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవలే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” కూడా మల్టీస్టారర్ గా తెరకెక్కి దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అనేక రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించడం జరిగింది. ఇద్దరూ కూడా పోటా పోటీగా నటించి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా అలరించారు. ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి చరణ్ రెడీ అయినట్లు లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించనున్నారట.
సీత స్వయంవరంలో శివ ధనుర్భాగం తర్వాత రాముడిని సవాలు చేసే పరుశురాముడు పాత్రలో చరణ్ కనిపించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవ దత్త నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది.