RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR ఇండస్ట్రీ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. RRR విజయంలో చరణ్ కీలక పాత్ర పోషించాడని చాలా మంది సెలబ్రెటీలు చెప్పటం విశేషం. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన కెరీర్ లో 15వ సినిమా సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విశాఖపట్టణం, రాజమండ్రి ఇంకా పంజాబ్ రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకోవడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చరణ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు, అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అన్నట్టు టాక్. కియారా అద్వానీ.. చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సునీల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా తాజాగా రామ్ చరణ్ కి తల్లి పాత్రకు సంబంధించి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి తీసుకురావటానికి శంకర్ డిసైడ్ అయినట్లు టాక్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ నీ తీసుకునే ఆలోచనలో శంకర్ డిసైడ్ కావడం జరిగిందట. అయితే సినిమా యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
ఇటీవలే నీతు కపూర్ కోడలు రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ “RRR”లో చరణ్ కి జోడీగా నటించడం తెలిసిందే. అయితే ఇప్పుడు రణబీర్ తల్లి చరణ్ తల్లిగా సినిమాలో నటించడం విశేషం. ఏది ఏమైనా చాలావరకు ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు దక్షిణాది సినిమాలు చేయడానికి ముందుకు రావటం శుభపరిణామం అని చెప్పవచ్చు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న RC15 దసరా పండుగకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.