గత ఏడాది విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన చిత్రాల్లో `కె.జి.యఫ్ చాప్టర్ 1` ఒకటి. ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో అందరి దృష్టి దీని కొనసాగింపుగా వస్తున్న `కె.జి.యఫ్ చాప్టర్ 2`పై నెలకొంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనాటాండన్ ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. పార్ట్ వన్లో ఈ ఇందిరాగాంధీ పాత్ర ఒకటుందని మాత్రమే ఎలివేట్ అయ్యింది. కానీ చాప్టర్ 2లో పాత్ర నిడివిని పెంచి ఇప్పుడు ఎక్కువగా చేసి చూపించబోతున్నారట
previous post
next post