ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం వర్మ తీసిన ‘పవర్ స్టార్’ మూవీ. దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్మని కౌంటర్ చేస్తూ ‘పరాన్నజీవి’ అనే సినిమా తీశారు. వీరిద్దరూ పోటాపోటీగా ఈ నెల 25న సినిమాలు విడుదల చేస్తున్నారు. అయితే.. పవన్ ఫ్యాన్స్ వర్మను టార్గెట్ చేయడంతో దమ్ముంటే నా ఆఫీస్ కు వచ్చి మాట్లాడండి అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నిన్న కొంతమంది ఫ్యాన్స్ వర్మ ఆఫీస్ కు వెళ్లారు. అయితే.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసుల వరకూ విషయం వెళ్లింది. పవన్ ఫ్యాన్స్ దాడి చేశారని వర్మ.. వర్మ సిబ్బందే దాడి చేశారని ఓయూ జేఏసి మెంబర్ సంపత్ అంటున్నారు. దీనిపై వర్మ స్పందించాడు.
‘నేను పవన్ కు వీరాభిమానిని. సినిమాలో పవన్ ను ఉన్నతంగానే చూపించాను. ఆ విషయం వారికి అర్ధ: కావట్లేదు. నాపై దాడి చేస్తే నేను గాజులు తొడుక్కుని కూర్చోలేదు. అన్ని సమయాల్లో అలెర్ట్ గా ఉండలేం. అలాంటి టైమ్ లో వారు దాడి చేశారు. ఈసారి వస్తే నేనేంటో చూపిస్తా. దాడి చేసిన వారికి నా కౌంటర్ ఎలా ఉంటుందో చూపిస్తా. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఉంది. నాపైన ఎవరో సినిమా తీయడం ఏంటి. నేను వోడ్కా తాగుతాను, పోర్న్ చూస్తాను, బ్లూఫిల్మ్ తీస్తాను అని చెప్పాను. అమ్మాయిల తొడలపై మాట్లాడాను. అన్నీ నేనే చెప్పాక వాళ్లు సినిమా తీసి ఇంకేం చూపిస్తారు.
నా సినిమాల్లో న్యూడిటీ మాత్రమే మీకు గుర్తుంటుంది. ఇది ఎరోటిక్ ఫిల్మ్ అని ముందే చెప్పా. నన్ను తిట్టారు. నా డాటర్ పై కామెంట్ చేశారు. దేన్నీ పట్టించుకునే టైమ్ లేదు. వారిష్టం వచ్చినట్టు చూపించుకోమనండి’ అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు వర్మ. మరి ఈ వివాదం మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఫ్యాన్స్ పై వర్మ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.