బాహుబలి వంటి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తోన్న చిత్రం `ఆర్ఆర్ఆర్` . ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉంది. ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ “దక్షిణాదికి చెంది ఓ బ్లాక్బస్టర్ డైరెక్టర్ చేస్తోన్న చిత్రం విడుదల తేదీ మారే అవశాలున్నాయి. ఈ భారీ చిత్రం అక్టోబర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి“ అంటూ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. టాలీవుడ్ అగ్రకథానాయకులు ఎన్టీఆర్, రామ్చరణ్లతో పాటు సముద్రఖని, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్; అలిసన్ డూడీ, ఒలివియో మోరిస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.