ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఇవాళ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు వారం క్రితం తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీనిపై నిర్ణయం తీసుకుంది. షూటింగ్ లు ఆపేయాలని వారం క్రితం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని, ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యే వరకు షూటింగ్లు నిలిపివేస్తామని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ఆగస్టు 2న మరోసారి సమావేశం అవుతామని తెలిపింది. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలపై బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. క్రేజ్ ని బట్టి హీరోలకు రెమ్యూనరేషన్ ఉంటుంది, ఎవరి స్థాయికి వారికి ఉంటుందని అన్నారు. హీరోల సినిమాలను మార్కెట్ చేసుకునే దాని బట్టి కలెక్షన్లు వస్తాయని, అంతేకాని రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని కోరడం తప్పుడు నిర్ణయమని విమర్శించారు.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఉండగా.. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అసలు ఎందుకని ప్రశ్నించారు. అలాగే తెలుగు సినిమా నిర్మాతల మండలి ఛైర్మన్ సి.కల్యాణ్, సభ్యులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, స్టార్ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ కూడా గిల్డ్ నిర్ణయంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్స్ సెక్టర్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గిల్డ్ నిర్ణయంపై స్పందించారు.
గిల్డ్ నిర్ణయం సరైనదేనని మద్దతు ఇచ్చారు. గిల్డ్ సభ్యులు తీసుకుున్న నిర్ణయానికి నిర్మాతలంతా సపోర్ట్ చేయాలని కోరారు. నిర్మాతలందరూ ఏకతాటిపైకి రావాలని, ఒకే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఉప్మా సినిమాలు తీసే కొంతమంది, అసలు సినిమాలు తీయనివాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే బండ్ల గణేష్ కు కౌంటర్ ఇచ్చారా? అని కొంతమంది ంటున్నారు.