నటుడు సుశాంత్ సింగ్ సరిగ్గా కరోనా వైరస్ వచ్చిన టైములో లాక్ డౌన్ పెట్టిన సమయంలో సూసైడ్ చేసుకోవడం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఏ కారణం చేత సుశాంత్ మరణించి ఉంటాడు అన్నది ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కెరియర్ పరంగా మంచి పొజిషన్లో ఉన్న టైంలో మరణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ కేసులో సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకున్నట్లు …డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్సీబీ గత రెండు సంవత్సరాల నుండి సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేస్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసుకు సంబంధించి మొదటినుండి సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ నటీ రియా ప్రముఖంగా వినిపిస్తోంది. అనేకమార్లు ఎన్సీబీ కూడా రియాని విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా తాజాగా సుశాంత్ సింగ్ నీ డ్రగ్స్ కి బానిస చేసింది రియా అని ఎన్సీబీ స్పష్టం చేసింది. అనేక మార్లు సుశాంత్ సింగ్ కోసం రియా డ్రగ్స్ కొనడం జరిగిందంట. ఈ క్రమంలో 2020 ప్రారంభంలో డ్రగ్స్ అమ్ముడు చేసే కొంత మందికి రియా డబ్బులు చెల్లించినట్లు కూడా ఎన్సీబీ… న్యాయస్థానాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది.
శామ్యూల్ మిరాండా, షోవిక్ చక్రబర్తీ, దీపేష్ సావంత్ తదితరుల నుంచి అనేక సార్లు గంజాయి కొనుగోలు చేసినట్లు ఎన్సీబీ గుర్తించింది. దీంతో సుశాంత్ సింగ్ నీ..డ్రగ్స్ కు బానిసను చేసింది రియానే అని ఎన్సీబీ అభియోగ పత్రంలో వెల్లడిపరిచింది. దీంతో బాలీవుడ్ నటి రియా.. మెడకి గట్టిగానే డ్రగ్స్ కేసు చుట్టుకున్నట్లయింది.