Mahesh Babu: ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ కు మిక్స్డ్ టాక్ వినిపించింది. ఏదేమైనా చాలా కాలం తర్వాత మహేష్ ఖాతాలో ఆశించిన హిట్ మాత్రం మిస్ అయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఎస్ఎస్ రాజమౌళి లతో చేయబోయే సినిమాలతో ఆ లోటు తీరుతుందని ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు. గతంలో వీరిరువురి కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ గా తెరకెక్కబోయే ఈ మూవీని జూలై నుంచి సెట్స్పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మహేష్ ని ఆకట్టుకొని త్రివిక్రమ్ స్క్రిప్ట్..
ఇటీవలే మహేష్ తన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్గా జర్మనీ వెళ్ళారు. అయితే, బాబు వచ్చేసరికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ వినిపించేందుకు త్రివిక్రమ్, నిర్మాతలు కూడా జర్మనీ వెళ్ళి కథా చర్చలు జరుపుతున్నారట. అయితే త్రివిక్రమ్ తన ఫుల్ స్క్రిప్ట్ తో సూపర్ స్టార్ ను మెప్పించలేకపోయారని టాక్ నడుస్తోంది. సెకండాఫ్ స్క్రిప్టు మహేష్ ను ఆకట్టుకోలేకపోయిందని.. కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మహేష్ చెప్పిన మార్పులు చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంగీకరించారని అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మహేష్ సరసన ప్రియాంక మోహన్?!
ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ని తీసుకుంటున్నట్టు టాక్. మరోవైపు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు…వీరిద్దరి కాంబినేషన్ లో అతి త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఇటు రాజమౌళి అభిమానులతో పాటు.. అటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.