Vijay devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అందుకు కారణం `లైగర్` షూటింగ్ ఆగిపోవటమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తొలిసారి తెరకెక్కుతున్న తాజా చిత్రమే `లైగర్`. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, పూరీ జగన్నాథ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఆగస్ట్ 25న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విజయ్ అభిమానులతో పాటుగా సినీ ప్రియులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకుపడుతుండడంతో.. మేకర్స్ ఈ సినిమా షూటింగ్ను నిలిపివేశారు.
ఇప్పటికే సెకెండ్ వేవ్ కారణంగా ఒకసారి వాయిదా పడిన లైగర్ షూటింగ్.. మళ్లీ ఒమిక్రాన్ దెబ్బకు నిలిచిపోవడంతో విజయ్ దేవరకొండ ఫుల్ సాడ్ మూడ్లోకి వెళ్లిపోయాడు. అంతే కాదు, `కొవిడ్ మళ్లీ తుపానులా విజృంభిస్తుండటంతో లైగర్ చిత్రీకరణ రద్దయింది. ఇంటికి తిరిగొచ్చేలా చేసింది` అంటూ తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విజయ్.. మూడాప్తో కూర్చొన్న ఫొటోను కూడా షేర్ చేశాడు. దాంతో ఆయన పోస్ట్ కాస్త వైరల్గా మారింది.
Apparently its another wave Storm.
Shoots cancelled. Back to us just chilling at home.. pic.twitter.com/mnJ2w1aGWy
— Vijay Deverakonda (@TheDeverakonda) January 7, 2022