హీరో విజయ్ దేవరకొండ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించిన విజయ్ తర్వాత “గీతాగోవిందం” తో రొమాంటిక్ హిట్టు అందుకుని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. దాదాపు అన్ని యావరేజ్ అట్టర్ ప్లాప్ సినిమాలు. ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ ఇటీవల “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేయడం తెలిసిందే. దీంతో ఈ సినిమా పైన విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా డాషింగ్ డైరెక్టర్ పూరి ఈ సినిమా చేయటంతో విజయ అభిమానులు సైతం “లైగర్” తో కం బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాయ్ వాలాగా అదేవిధంగా ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు.
దీనిలో భాగంగా ముంబైలో “లైగర్” కి సంబంధించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మొదటిలో ఏదైనా విషయం గురించి ప్రశ్నిస్తే ఎక్కువగా మాట్లాడే వాడిని. కానీ ఇప్పుడు అనవసరం అనిపిస్తుంది. అలాంటి ప్రశ్నల విషయంలో కొందరు నాపై ముందుగానే ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. నేను కొత్తగా చెప్పే విషయాలు వారి ఆలోచనలను మార్చవు. అందుకే కొన్నిసార్లు నోరు విప్పకపోవటమే మంచిదని నమ్ముతా అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.