మహి వి రాఘవ్ దర్శకత్వంలో, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లీడ్ ప్లే చేస్తున్న సినిమా యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, ఇప్పుడు యాత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ లో రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసేలా కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే, సినిమా పక్కా హిట్ అయ్యేలాగే కనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డికి ప్రజలకి మధ్య ఉన్న బాండింగ్ ని చూపించడానికి దర్శకుడు పడిన కృషి కనిపిస్తుంది. మమ్ముట్టి డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ట్రైలర్ తోనే మెప్పించిన యాత్ర సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
previous post