Rohit Sharma: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ లో భారత్ గెలవడంతో పాయింట్లు పట్టికలో టాప్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ఆదివారం నెదర్లాండ్స్ పై భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు అందించిన టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో దగ్గర సారధి సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డ్ ను రోహిత్ శర్మ అధిగమించాడు. 2003 వన్డే ప్రపంచ సౌరవ్ గంగూలీ సారధ్యంలో టీమిండియా వరుస విజయాలు సాధించింది.
కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రీకీ పాంటింగ్ సారథ్యంలో ఆసీస్…2003, 2007 వన్డే ప్రపంచ కప్ లో వరుసగా 11 మ్యాచ్ లు గెలవడం జరిగింది. ఈ రెండు డోర్ నేలలో ఓటమెరుగని జట్టుగా ఆస్ట్రేలియా నిలిచి రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత 2017 వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ వరుసగా 8 మ్యాచులు గెలిచి ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతున్నది. తాజా టోర్నీలో టీమిండియా సెమీస్ తో పాటు ఫైనల్ గెలిస్తే ఆస్ట్రేలియా రికార్డును సమం చేయనుంది. ఇదిలా ఉంటే బుధవారం ముంబాయి వేదికగా తొలి సెమీ ఫైనల్ జరగనుంది.
ఈ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ నీ భారత్ చిత్తశుద్ధిగా ఓడించింది. ఈ క్రమంలో సెమీఫైనల్ లో కూడా ఓడించి గత ప్రపంచ కప్ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ ప్లేయర్స్ ఉన్నారు. గతంలో 2011లో ధోని సారధ్యంలో ఇండియాలో జరిగిన వన్డే ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఆ తర్వాత 2015, 2019 లలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా ఓటమిపాలైంది. అయితే ప్రస్తుతం భారత్ జట్టు ఆట తీరు చూస్తే అన్ని రకాలుగా రాణిస్తూ ఉంది. దీంతో ఈసారి ప్రపంచ కప్ గెలవాలని ఇండియన్ క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.