T20 WC 2022: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా ICC T20 వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ ప్రపంచ విజేతగా కప్ గెలవడం తెలిసిందే. ఇండియా టీం సెమీఫైనల్ దాకా వెళ్లి ఇంగ్లాండ్ పై ఓడిపోయి ఇంటికి వచ్చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) …2022 ఐసీసీ వరల్డ్ కప్ ఎంతమంది..? ఏ రీతిలో వీక్షించారు..? అన్న వాటి విషయాలు తెలియజేసింది. ఈ సందర్భంగా గత ఏడాది టీ20 వరల్డ్ కప్ రికార్డును అధిగమించి 65% మంది డిజిటల్ గా తిలకించారని పేర్కొంది. క్రికెట్ చరిత్రలో ఇది ఒక సెన్సేషనల్ రికార్డు అని స్పష్టం చేయడం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా పలు యాప్స్ ద్వారా ఎక్కువమంది చూసినట్లు స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఐసీసీ ఈ వరల్డ్ కప్ టోర్నీలో… మ్యాచ్ ప్రారంభానికి ముందు రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. పిచ్ రిపోర్టుతో పాటు.. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే ప్రాంతం వద్ద ఇంటర్వ్యూలు, మ్యాచ్ జరుగుతున్న సమయంలో 360 డిగ్రీ విజువలైజేషన్, ఇంకా బిగ్గెస్ట్ సిక్సెస్, మ్యాచ్ హైలెట్స్, ఫీల్డింగ్ పొజిషన్ ఇన్ఫర్మేషన్… ఈ రకమైన కార్యక్రమాలను అటు టెలివిజన్ రంగంలో ఇటు డిజిటల్ రూపంలో కూడా అందించడం జరిగింది. దీంతో అన్ని కలుపుకొని ఈ వరల్డ్ కప్ 365 మిలియన్ గంటల డిజిటల్ స్ట్రీమింగ్ అయినట్లు తెలియజేశారు. ఇది గత వరల్డ్ కప్ కంటే అధికమని ఐసీసీ లెక్కలు బయటపెట్టింది.
గత ఏడాది T20WC 2021లో 149 మిలియన్ గంటలు మాత్రమే స్ట్రీమింగ్ అయినట్లు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం టోర్నిలో అత్యధికంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి 256 మిలియన్ వ్యూ అవర్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయినట్లు స్పష్టం చేశారు. డిజిటల్ రూపంలో ఇండియాలో చాల బాషలలో వరల్డ్ కప్ ప్రసారం అయింది. తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ కావడం జరిగింది. దీంతో చాలామంది తమ మాతృభాషలలో మ్యాచ్ లు తిలకించారు. ఈ రీతిగా క్రికెట్ చరిత్రలో T20 WC 2022 అత్యధికంగా డిజిటల్ రూపంలో మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయినట్లు ICC తాజా లెక్కలు తేలియజేసింది.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!