ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న…! బీజేపీ – వైసీపీ మధ్య డీల్ ఏంటి..? సంబంధం ఏంటి..? మోడీని, బీజేపీని జగన్ విమర్శించరు.., జగన్ ని బీజేపీ నాయకులూ పెద్దగా విమర్శించరు. ఏదో వారానికో, పది రోజులకో అంటారు తప్ప… ప్రత్యేకంగా అంశాన్ని టార్గెట్ చేస్తూ ఏమి అనరు..!! అందరికీ తెలిసి బిజెపికి రాజ్యసభలో జగన్ అవసరం ఉంది. జగన్ కి కేసుల విషయంలో బీజేపీ అవసరం ఉంది..! అనే అనుకుంటారేమో. సరే అది కారణం అవ్వొచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మరో కారణం బయటకు వస్తుంది. అది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.
రాజధానిపై బీజేపీ వైఖరి ఏంటి…??
రాజధాని అమరావతి. చంద్రబాబు మానస పుత్రిక. టీడీపీకి రాజకీయ ఆయుధం. చంద్రబాబు ఎన్నో కళలు కని దానికి శంఖుస్థాపన చేసారు. నాడు రెండు పార్టీలు కలిసే ఉండడంతో ప్రధాని మోడీ కూడా నీరు, మట్టి తీసుకువచ్చి అంకురార్పణ చేసారు. అంటే టీడీపీ సహా, బిజెపికి కూడా రాజధానిపై ఎంతో కొంత భాగస్వామ్యం ఉన్నట్టే. మరి జగన్ వచ్చి రాజధాని మారుస్తాము అంటే టీడీపీ పోరాడుతుంది. ఆ అమరావతి రైతుల వెనుకా, ముందు ఉంటుంది. కానీ బీజేపీ మాత్రం దొంగా- పోలీస్ ఆట ఆడుతుంది. కన్నా లక్ష్మీనారాయణ ఒక మాట, సోము వీర్రాజు ఒక మాట, సుజనా చౌదరి ఒక మాట, జివిఎల్ నరసింహారావు ఒక మాట… ఇలా ఒక్కో నాయకుడూ ఒక్కోలా మాట్లాడుతుంటారు. భిన్నంగా మాట్లాడుతూనే “ఇది పార్టీ నిర్ణయం” అని తోకని జోడిస్తారు. ఆ పార్టీకి ఎన్ని నిర్ణయాలున్నాయో వారికే తెలియాలి…! ఏది ఏమైనా రాజధాని విషయంలో సింగిల్ స్టాండ్ లో మాత్రం బీజేపీ లేదు. అలాగే ఉంటె, గట్టిగా నిలబడితే జగన్ ఏనాడో తోక ముడిచి వారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ లాంటి పార్టీ గట్టిగా చెప్తే జగన్ కాస్త అటూ ఇటుగా అయినా మాట వినేవారు. కానీ బీజేపీ చూసీ చూడనట్టు పోతుంది. ఏదో వారికి ఉనికి కావాలి కాబట్టి అప్పుడప్పుడూ ఆ పోరాటంలో అతిథిలా మాట్లాడుతూ, ఉత్తుత్తి పోరాటం చేస్తుంది.
హోదాపై జగన్ మాటేమిటి…??
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జగన్ సీఎం కాకముందు ఏమన్నారు? హోదా సాధిస్తాం. 25 మంది ఎంపీలని ఇవ్వండి అన్నారు. జనం 25 మందిని కాకపోయినా…, 22 మందిని ఇచ్చారు. సీఎం అయ్యారు, ఆ తర్వాత జగన్ ఏమన్నారు..? హోదాని గట్టిగా అడగాలి అంటే బీజేపీకి మన అవసరం లేదు. వాళ్ళకి బలం ఉంది. అందుకే ఇప్పుడు మన మాట వినరు. అన్నారు…! అంటే హోదా విషయంలో కొంత మాట దాటేశారు. ఎందుకంటే జగన్ కి బాగా తెలుసు. హోదా అనేది అడిగినా, పోరాడిన ఇచ్చేది కాదు అని. అందుకే ఇలా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు డీల్ మాట్లాడదాం…!!
సరే ఇప్పుడు రెండు పార్టీల డీల్ ఏంటో చెప్పుకుందాం. పైన చెప్పుకున్నట్టు మూడు రాజధానులు అనేది వైసిపికి కీలకం. ఆ విషయంలో బీజేపీ ఏమి గట్టిగా మాట్లాడట్లేదు. కానీ చేయాలంటే వైసీపీని ఇరుకున పెట్టొచ్చు, రాజకీయంగా బద్నం చేయొచ్చు. ఇదే సందర్భంలో హోదా విషయంలో బీజేపీని కూడా వైసిపి బద్నాం చేయొచ్చు. కానీ అక్కడ బిజెపి చేయట్లేదు. ఇక్కడ వైసీపీ చేయట్లేదు. గట్టిగా ఒకరినొకరు అడిగితే ఈ రెండు విషయాలు టీడీపీకి బలాన్నిస్తాయి. పైగా హోదా ఇవ్వడం బీజేపీకి సాధ్యం కాదు. ఇవ్వాలి అంటే చాలా రాష్ట్రాల్లో అనేక డిమాండ్లు ఒప్పుకోవాలి. మరోవైపు రాజధాని అంశంలో రాజీపడడం వైసీపీకి ఇష్టం లేదు. అందుకే డీల్ ఉంది. మీరు హోదా అడగొద్దు… మీరు రాజధానికి అడ్డు పడొద్దు. ఇదన్నమాట. తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చిన అంశం.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!