Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” విడుదల కాబోతోంది. 2021లో డిసెంబర్ నెలలో “పుష్ప” మొదటి భాగం రిలీజ్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. “పుష్ప” సినిమా డైలాగులు, పాటలు, డాన్స్ మొత్తం ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. “పుష్ప” మానియా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. ఈ సినిమాలో “తగ్గేదేలే” డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ గా స్టిల్ ఇప్పటికి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రమోషన్స్ ఏమీ చేయకపోయినా గానీ అక్కడ ₹100 కోట్లు కాబట్టి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు కూడా లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా అవార్డు అందుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే రెండో భాగం షూటింగ్ మొదలుకాకముందే ఇప్పుడు “పుష్ప” మూడో భాగం కూడా ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. పార్ట్ 2 కి “పుష్ప దీ రూల్” అనే టైటిల్ ఫిక్స్ చేయగా మూడో భాగానికి..”పుష్ప దీ రోర్” టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
కానీ “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ ఫలితం బట్టి మూడో భాగం షూటింగ్ స్టార్ట్ చేసే ప్లాన్స్ లో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ పుష్ప మూడో భాగం వార్తలపై మూవీ టీం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే “పుష్ప” సెకండ్ భాగంలో ఐటెం సాంగ్ చాలా బాగా వచ్చినట్లు ఫిలింనగర్ టాక్. మొదటి భాగంలో “ఊ అంటావా మావా” సాంగ్ మంచి మ్యూజికల్ హిట్ అయింది. దీంతో రెండో భాగంలో ఐటెం సాంగ్ పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంచి మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చినట్లు సమాచారం.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!