Tollywood Child Artist: పైన ఫోటోలో బబ్లీగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. అయితే ఇప్పుడు లాయర్ గా సత్తా చాటుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు శ్రియా శర్మ. హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ కు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో శ్రియా జన్మించింది. తండ్రి వికాస్ శర్మ ఇంజనీర్ కాగా.. తల్లి రితు డైటీషియన్. శ్రియా శర్మ 8 ఏళ్ల వయసులో జై చిరంజీవ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో చిరంజీవికి మేనకోడలిగా లావణ్య పాత్రలో అలరించింది. తన అల్లరి, చిలిపి మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జై చిరంజీవ పరాజయం పాలైనా కూడా శ్రియాకు మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి. అలా 2006లో సిల్లును ఒరు కాదల్ మూవీతో తమిళంలోకి, 2007లో సౌందర్య మూవీతో కన్నడలోకి, లాగ చునారి మే దాగ్ మూవీ తో హిందీలోకి ప్రవేశించింది. బాలీవుడ్ లో 2011న వచ్చిన చిల్లర్ పార్టీ మూవీ ఆమెకు భారీ ప్రజాదరణ దక్కేలా చేసింది. ఈ చిత్రానికి గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డును శ్రియ అందుకుంది.
తెలుగులో దూకుడు, రచ్చ, ఎటో వెళ్లిపోయింది మనసు తదితర చిత్రాల్లో శ్రియ నటించింది. బుల్లితెరపై అనేక టీవీ సీరియల్స్ లో కూడా పనిచేసింది. 2015లో గాయకుడు మూవీతో హీరోయిన్ గా మారింది. అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఆ తర్వాత రోషన్ మేకతో నిర్మల కాన్వెంట్ చిత్రంలో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ క్లిక్ అయిన శ్రియా హీరోయిన్గా ఎదగలేక పోయింది. 2016 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన శ్రియ.. ప్రస్తుతం లాయర్ వృత్తిలో బిజీగా గడుపుతోంది.
చిన్నతనం నుంచి శ్రియా చదువుల్లో ముందుండేది. ఓవైపు యాక్టింగ్.. మరోవైపు స్టడీస్ ను శ్రియ చక్కగా బ్యాలెన్స్ చేసింది. ఇక 2016 తర్వాత ఆమె తన ఫోకస్ మొత్తాన్ని స్టడీస్ పై పెట్టింది. ముంబైలోని ఓ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకుంది. ఆ వెంటనే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు అడ్వకేట్ గా వ్యవహరిస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. ఇక సినిమాలకు దూరమైనా కూడా సోషల్ మీడియాలో శ్రియా శర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పటితో పోలీస్ శ్రియా ఇప్పుడు చాలా బొద్దుగా మారడం వల్ల నెటిజన్లు ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు.