Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుసపరాజుయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయినా గాని మనోడికి ఎక్కడా కూడా అవకాశాలకి కొదువ లేదు. ఒకపక్క వరసగా ప్లాపులు పడుతున్నా గానీ మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం విజయ్ దేవరకొండకి అవకాశాలు రావడం విశేషం. ఈ ఏడాదిలో ఆగస్టు నెలలో “లైగర్” సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు విజయ్ దేవరకొండ కష్టపడ్డాడు. సినిమా పరాజయం పాలు కావడంతో కష్టం మొత్తం వృధా అయ్యింది. ఇక ప్రస్తుతం చేస్తున్న “ఖుషి” సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సిన మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి… మోయాసోటీస్ కి సంబంధించి… చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో కొత్త సినిమాల స్టోరీలను వింటున్న విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పటివరకు ఏ హీరో తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. విషయంలోకి వెళ్తే తన మరణం తర్వాత అవయవదానానికి విజయ్ ముందుకు వచ్చాడు. హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ… సౌత్ ఏషియాలో అవయవదానం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని, దీనిపై మరింత అవగాహన అవసరమని పేర్కొన్నారు.
దీనివల్ల ప్రాణాపాయంలో ఉన్నవారికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. తాను మాత్రమే కాదు తన తల్లి మాధవి కూడా అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చేస్తున్న “ఖుషి” మూవీ షూటింగ్ గ్యాప్ రావడంతో…వచ్చే జనవరికి కొత్త మూవీ సెట్స్ మీదకి తీసుకేలడానికి విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.