కృతి సనన్.. ఈ బ్యూటీ సినీ కెరీర్ టాలీవుడ్ లోనే మొదలైంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `1 నేనొక్కడినే` మూవీతో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్కు మఖాం మార్చింది.
అక్కడ వరుస సినిమాలో చేస్తూ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది. ఇక చాలాకాలం తర్వాత ఈ బ్యూటి మళ్ళీ `ఆదిపురుష్` మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రత్ కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వివిధ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
ఇప్పటికే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను సైతం షురూ చేశారు. ఇదిలా ఉంటే.. కృతి సనన్ తాజా ఫోటోషూట్ నెట్టంట వైరల్ గా మారింది. అద్దాలు అతికించిన బ్లాక్ కలర్ ట్రెండ్ డ్రెస్ను ధరించిన కృతి సనన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్లో స్కిన్ షో చేసింది.
కృతి సనన్ అందాల జాతరకు నెటిజన్లు అదరహో అంటున్నారు. అంతలా గ్లామర్ మెరుపులతో కృతి మైండ్ బ్లాక్ చేసింది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా `ఆదిపురుష్` భామ అందాల పిక్స్పై ఓ లుక్కేయండి.