Madhuranagarilo March 29 2024 Episode 325: రుక్మిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాక్షాయిని రుక్మిణి ఎందుకు అంత కోపంగా ఉంది అని చలపతి అంటాడు. నాకేం తెలుసండి వెళ్లి అడుగుదాం పదండి అని దాక్షాయని అంటుంది. రుక్మిణి ఏంటమ్మా అంత కోపంగా తిరుగుతున్నావ్ ఏం జరిగింది అని చలపతి అంటాడు.ఇంకా ఏం జరగాలి బాబాయ్ పండుకి ఐస్ క్రీమ్ ఆశ చూపెట్టి అమ్మ అని పిలవరా అంటే వాడు నన్ను పిలవకుండా రాయి పెట్టి కొట్టాడు స్కూల్ దగ్గరికి వెళ్లి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను తినరా అంటే ఆ రాధ వచ్చి అడ్డుపడింది అసలు నా బిడ్డని ఎలా సొంతం చేసుకోవాలి అర్థం కావట్లేదు సామ దాన భేద దండోపయాలను ఉపయోగించిన సరే పండుని నేను సొంతం చేసుకుంటాను అని రుక్మిణి అంటుంది.
రుక్మిణి సామ దాన దండోపయాలు శ్యామ్ మీద కూడా ఉపయోగించు అని చలపతి అంటాడు. శ్యామ్ మీదనా ఎందుకు బాబాయ్ అని రుక్మిణి అంటుంది. ఎందుకంటావ్ ఏంటమ్మా ఇప్పుడు పండు నీకు దగ్గరయ్యాడు అనుకో అప్పుడు నాన్న కావాలి అంటాడు నాన్నను ఎక్కడినుంచి తెచ్చి ఇస్తావ్ అందుకే శ్యామ్ నీకు దగ్గరయ్యాడనుకో అప్పుడు ఆస్తి నీ దగ్గరే ఉంటుంది నీ భర్త నీ దగ్గరే ఉంటాడు నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు నువ్వే మహారాణి అయిపోతావు ఇంటికి అని చలపతి అంటాడు. నువ్వు శ్యామ్ ఒకటయ్యారని తెలిస్తే రాదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు నీ ఇల్లు నీ కుటుంబం అంతా నీ చేతుల్లో ఉంటుంది ఆలోచించు అని దాక్షాయిని అంటుంది. ఇంతలో శ్యామ్ ఆటో వేసుకొని అక్కడికి వస్తాడు. మీ మేము అన్నామో లేదో శ్యామ్ కూడా వచ్చేసాడు చూడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో అని దాక్షాయని చెబుతుంది. రుక్మిణి శ్యామ్ దగ్గరికి వెళ్లి ఏంటి సుందరం అని అడుగుతుంది. నువ్వేంటి మా ఇంటికి వచ్చావ్ అని శ్యామ్ అంటాడు.
నేను మీ ఇంటికి రాలేదు నువ్వే మా ఇంటికి వచ్చావు అని రుక్మిణి అంటుంది. అవునా అయితే వెంటనే వెళ్ళిపోతాను అని శ్యామ్ అంటూ ఉండగా మజ్జిగ తాగి వెళ్దువు రా శ్యామ్ తాగి ఉన్నావ్ అని రుక్మిణి లోపలికి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, మా రాధా శ్యామ్ ఇంకా రాలేదా పండు ఏం చేస్తున్నాడు అని ధనంజయ అడుగుతాడు. పండు పడుకున్నాడు మామయ్య ఆయన ఇంకా రాలేదు అని రాదా చెబుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ధనంజయ్ అంటూ ఉండగా కిరణ్ ఫోన్ చేస్తాడు. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు అని రాదా ఫోన్ ఎత్తుతుంది. అమ్మ రాధా శ్యామ్ ఇంటికి వచ్చాడా అని కిరణ్ అడుగుతాడు.
ఇంకా రాలేదండి ఏం జరిగింది అని రాదా అడుగుతుంది. ఎంతో గొప్పగా బతికిన మీరు ఇలా కష్టాలు పడుతున్నారని చూసి తట్టు కొంచెం డ్రింక్ చేశాడమ్మా పండు కి బొమ్మ కొనడం కోసం నువ్వు రక్తం అమ్ముకున్నావ్ అంట కదా ఆ సంఘటన వాడిని ఇంకా బాధ పెట్టి మందు తాగాడు వాడిని నేను ఇంటికి తీసుకొస్తాను రా అంటే నేనే వెళ్తాను అన్నాడు ఇంకా రాలేదా అని కిరణ్ అంటాడు. ఇంకా రాలేదండి అని రాదా చెబుతుంది. సరేనమ్మా వాడు ఎక్కడున్నాడో నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని కిరణ్ ఫోన్ కట్ చేస్తాడు.ఏంటండీ ఇది వాడు మళ్ళీ మందు తాగడం ఏంటి అని మధుర అంటుంది. పరిస్థితిలకు లోనైనప్పుడు ఇలాంటి వాటికి అలవాటు పడుతూ ఉంటారు అని ధనంజయ్ అంటాడు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనిషి ఇలా అంటీ వాటికి అలవాటు పడకూడదు ఆయన ఇకమీదట మళ్లీ డ్రింక్ చేయకుండా నేను చూసుకుంటాను ఆయన ఎక్కడ ఉన్నాడో వెళ్లి వెతికి తీసుకొస్తాను అని రాదా అంటుంది. రాధా ఉండు నేను కూడా వస్తాను ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు అని ధనంజయ్ తోడుగా వెళ్తాడు. కట్ చేస్తే, రుక్మిణి చక్కగా రెడీ అవుతుంది. రుక్మిణి శ్యామ్ దగ్గరికి వచ్చి తనని ఫోన్లో పడుకోబెట్టుకుని శ్యామ్ సుందర నీకు ఇష్టమైన సారీ కట్టుకున్నాను అని అంటుంది. రాధా ధనుంజయ్ శ్యామ్ కోసం వెతుకుతూ ఉంటారు. శ్యామ్ హాయిగా నిద్రపోతాడు.
ఇదిగో నీకోసం మల్లెపూలు కూడా పెట్టుకున్నాను అని రుక్మిణి శ్యామ్ బుగ్గలు నియమండుతుంది. రాధా ధనుంజయ్ వెతుకుతూ మామయ్య ఈయన ఎక్కడ లేడు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని రాధా అంటుంది. ఒకవేళ అలవాటు ప్రకారం మధురానగర్ కాలనీకి వెళ్ళు ఉండొచ్చు కదా అని ధనంజయ్ అంటాడు. సరే అయితే వెళ్లి చూద్దాం పద అని రాదా ధనంజయ్ ఆటో తీసుకొని మధురానగర్ కాలనీకి బయలుదేరుతారు. నీ గుండెల్లో ఎప్పటికీ నేనే ఉండాలి ఆరాధ శాశ్వతంగా నీకు దూరమైపోవాలి అని రుక్మిణి శ్యామ్ గుండెల మీద పడుతుంది. బాబు త్వరగా పోనీ అని ధనంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!