Heeramandi Web Series: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ తాజాగా తెరకెక్కించిన ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ వెబ్ సిరీస్ ” హీరమండి “. ఈ సిరీస్ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించాడు సంజయ్ లీలా. ఇంత భారీ బడ్జెట్ సిరీస్ లో నటీనటులు అందుకున్న రెమ్యూనిరేషన్లు ఎంతో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. సంజయ్ లీల భన్సాలీ సినిమాలు అంటేనే ఓ విజువల్ ఫీస్ట్. అలా చూపించడానికి అతడు భారీగానే ఖర్చు పెట్టాడు. అలాంటి డైరెక్టర్ తొలిసారి ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు అంటే దానికి బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
పైగా ఇందులో సోనాక్షి సిన్హా, రిచా చద్దా, మనీషా కొయిరాలా, సంజీదా షేక్, అదితి రాయ్ లాంటి బాలీవుడ్ నటిమనులు నటిస్తున్నారు. దీంతో వాళ్లకు రెమ్యూనిరేషన్ రూపంలోనే పెద్ద మొత్తం పోసాడు డైరెక్టర్. అందులోనూ డైరెక్టర్ గా భన్సాలీయే అత్యధికంగా రూ. 60 నుంచి 65 కోట్ల రెమ్యూనిరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక నటి మనుల విషయానికి వస్తే.. వేళల్లో అత్యధిక మొత్తం అందుకున్న నటి సోనాక్షి సిన్హా. ఈమె ఈ వెబ్ సిరీస్లో నటించడానికి రూ. రెండు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఈమె ఫరీదా అనే పాత్రలో కనిపించనుంది.
కళంక్ మూవీ తరువాత సోనాక్షి నటించిన పీరియాడ్ డ్రామా ఇది. ఇక అదితి రాయ్ ఈ సిరీస్లో బిబ్బోజాన్ పాత్రలో నటించినది. దీనికోసం ఈమె రూ. కోటి నుంచి 1.5 కోట్లు వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది ఈమె జీ5 ఓటిటి లో వచ్చిన తాజ్ అనే మరో పిరియడ్ డ్రామాలోను నటించిన విషయం తెలిసిందే. ఒకప్పటి అందాల తార మనీషా కొయిరాలా ఈ సిరీస్లో మాలికాజన్ పాత్రలో నటించింది. ఈ పాత్ర కోసం ఈమె కోటి రెమ్యూనిరేషన్ తీసుకుంది. అటు మరో బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా లజ్జో పాత్ర కోసం కోటి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక చాలా రోజుల అనంతరం తిరిగి కెమెరా ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఈ సిరీస్ లో వలి మహ్మద్ పాత్ర పోషించాడు.
దీనికోసం ఇతడు రూ. 75 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సంజీదా షేక్ రూ.40 లక్షలు, షర్మిన్ సెహగల్ రూ.35 లక్షలు అందుకున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈమధ్య ఈ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. భారతదేశ స్వాతంత్రానికి ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీతం ఆధారంగా ఈ సిరీస్ తెరికెక్కించారు. అప్పట్లో వాళ్లు ఎంత విలాసవంతంగా బ్రతికారు కనిపించడంతోపాటు స్వాతంత్ర్యోద్యమంలో వాళ్లు పోషించిన పాత్రలను కూడా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సిరీస్ రిలీజ్ అనంతరం ఎంత మీరా రెస్పాన్స్ దక్కించుకుంటాయో చూడాలి. ఒకవేళ కనుక ఈ సిరీస్ సూపర్ హిట్ రెస్పాన్స్ దక్కించుకుంటే వీటికి సీక్వెల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.