Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆల్రెడీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా… వైసీపీ పార్టీ గెలవకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు పలు హ్యాష్ ట్యాగులతో ట్రెండింగ్ సృష్టిస్తున్నారు.
ఏది ఏమైనా మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “ఓజి” పనులు చక చక జరుగుతున్నాయి. ఈ సినిమా దర్శకుడు సుజీత్ స్పీడ్ పెంచారు. ఆల్రెడీ సెప్టెంబర్ 27వ తారీకు సినిమా విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉండటంతో షూటింగ్ ఆగిన గాని మరోపక్క బ్యాక్ గ్రౌండ్ వర్కులు వేగవంతం అయ్యేలా సుజీత్ తన పనులు చేసుకుంటూ పోతున్నారు. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో “ఓజి” సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి సీరియస్ డిస్కషన్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సుజీత్ తనతో చేసిన డిస్కషన్ కి సంబంధించి పోస్టు సోషల్ మీడియాలో చేసి “ఓజి” వర్క్ బిగిన్ అయిందని తమన్ ఫోటో రిలీజ్ చేయడం జరిగింది.
గత ఏడాది ఈ సినిమాకి సంబంధించి థండర్ స్టోమ్ అంటూ విడుదల చేసిన వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ వీడియోలో తమన్ అందించిన మ్యూజిక్ నీ అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో మాఫియా స్టోరీతో ఈ సినిమా తెరకెక్కటం జరిగింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్నట్లు వీడియో బట్టి తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. 50 శాతానికి పైగానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమానీ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ “అత్తారింటికి దారేది” రిలీజ్ రోజే “ఓజి” విడుదల తేదీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.