Prabhas: పాన్ ఇండియా స్టార్గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా గడుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే `ఆదిపురుష్`ను కంప్లీట్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం `సలార్`, `ప్రాజెక్ట్ కె` షూటింగ్స్లో పాల్గొంటున్నారు.
ఇవి పూర్తైన వెంటనే `స్పిరిట్` పట్టాలెక్కనుంది. అయితే వీటితో పాటే ప్రభాస్ ప్రముఖ డైరెక్టర్ మారుతితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఎప్పటి నుంచో జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి సైతం ప్రభాస్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయని ఓపెన్ అయ్యాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా ప్రభాస్ మారుతికి హ్యాండ్ ఇవ్వడం ఖాయమనే ప్రచారం మొదలైంది. అందుకు కారణం మారుతి రూపొందించిన `పక్కా కమర్షియల్` మూవీనే. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 1న గ్రాండ్గా విడుదలైంది.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. పక్కా రొటీన్ కమర్షియల్ మూవీ అంటూ చాలా మంది పెదవి విరిచారు. మారుతి రాసుకున్న ఈ కథ కొత్తదేం కాదు.. కొత్తదనమూ లేకపోవడంతో సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక మారుతితో సినిమా క్యాన్సిల్ చేసుకోబోతున్నాడంటూ టాక్ నడుస్తోంది. మరి దీనిపై అతి త్వరలో క్లారిటీ రానుంది.