Eagle: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ గా ఈగల్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ ఘట్టమనేని చాలా అద్భుతంగా సినిమా చేసినట్లు చాలామంది పొగడ్తలతో ముంచుతున్నారు. మొదటి సినిమాలోనే ఈ రకమైన టాలెంట్ చూపించడం చాలా గ్రేట్ అని అంటున్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నాగాని నూతన దర్శకులకు అవకాశం ఇవ్వటంలో రవితేజ ఎప్పుడు ముందుంటారు. ఆయన ద్వారా చాలామంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని కూడా ఆ రకంగానే పరిచయం కావడం జరిగింది. కాగా యాక్షన్ ఫిలింగా వచ్చిన “ఈగల్” నీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస అవసరాల, కావ్య తాపర్, మధుబాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. మూడు రోజుల్లోనే ఈ సినిమా మొత్తం ₹21 కోట్లకు పైగానే బిజినెస్ చేయడం జరిగింది. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆదివారం “ఈగల్” సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రవితేజ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిపై ప్రశంసల వర్షం కురిపించారు. నెక్స్ట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకుడు అవుతాడని వ్యాఖ్యానించారు. నేను చెబుతున్న దాన్ని రాసి పెట్టుకోండి. కార్తీక్ టాప్ దర్శకులలో ఒకరు అవుతారు. “ఈగల్” సినిమాను చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు అని కొనియాడటం జరిగింది.
పీపుల్స్ మీడియా సంస్థలో నేను చేసిన రెండో సినిమా ఇది. వారికి నా అభినందనలు. ఈ సినిమాలో నా పాత్ర పై సర్వత్ర ప్రశంసలు వస్తున్నాయి అంటూ హీరో రవితేజ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ పాల్గొని సినిమా ఇండస్ట్రీపై తప్పుడుగా వార్తలు రాసే వెబ్ సైట్లు పై మండిపడ్డారు. ముందు సినిమాలు పుట్టాయి … ఆ తర్వాతే ఈ వెబ్ సైట్స్ వచ్చాయని సెటైర్స్ వేశారు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నామంటే ముందు ఇంటిలోనే మాపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ట్రోలింగ్ సినిమా ఇండస్ట్రీ వాళ్లకి కొత్త కాదు. అన్నిటికీ తెగించి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు హరీష్ శంకర్ తెలియజేశారు. ప్రస్తుతం హరీష్ దర్శకత్వంలో రవితేజ “మిస్టర్ బచ్చన్” అనే సినిమా చేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!