బాలీవుడ్లో అనతి కాలంలో బిజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన అందాల భామ కియారా అద్వానీ.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీలో జంటగా నటించిన వీరిద్దరూ.. రియల్ లైఫ్ లో జంట కాబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగడం, ఒకరింటికి మరొకరు తరచూ వెళ్లడం వంటి అంశాలు ఆ వార్తలకు మరింత బలం చేకూరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కియారా ప్రియుడు సిద్ధార్థ్ తో పెళ్లి పీటలెక్కడం ఖాయమనే ప్రచారం గత కొద్ది రోజుల నుంచీ మరింత ఊపందుకుంది. అయితే ఈ ప్రచారమే నిజం అన్నట్లు హింట్ ఇచ్చాడో స్టార్ హీరో.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. షాహిద్ కపూర్. రీసెంట్ గా కియారా షాహిద్ కపూర్తో కలిసి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా చేస్తున్న పాపులర్ షో `కాఫీ విత్ కరణ్` సీజన్ 7లో గెస్ట్లుగా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా బయటకు వదిలారు. అయితే ఈ షోలో `సిద్ధార్థ్ తో నువ్వు రిలేషన్ షిప్ లో ఉన్నది నిజం కాదా` కరణ్ ప్రశ్నించగా.. అందుకు కియారా `అవునని చెప్పలేను అలాగని కాదని అనను` అంటూ రిప్లై ఇచ్చింది.
సిద్ధార్థ్, నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చా అని కరణ్ మరో ప్రశ్న వేయగా.. తమ మధ్య స్నేహానికి మించిన బంధం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇంతలోనే పక్కనే ఉన్న షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నెలలో కియారా అద్వానికి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోందంటూ హింట్ ఇచ్చాడు. దాంతో అది కియారా-సిద్ధార్థ్ పెళ్లి ప్రకటనే అంటూ చాలా మంది భావిస్తున్నారు.