టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఆగస్టు 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అందరి చూపు నిఖిల్ నెక్స్ట్ మూవీ అయినా `18 పేజెస్` పై పడింది.
ఇందులోనూ అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్ కాగా.. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న విడుదల కావాల్సి ఉంది.
కానీ కార్తికేయ 2 విడుదల తర్వాత ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ రాలేదు. గత కొద్ది రోజుల నుంచి మేకర్స్ ఈ మూవీ విషయంలో సైలెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను రీషూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఈ సినిమా అవుట్ పుట్ను నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ వీక్షించారట. అయితే ఆయన కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఆ సీన్స్ను రీషూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పైగా కార్తికేయ 2 విడుదల తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే `18 పేజెస్` విడుదల ఇప్పట్లో ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది.