Phone: నేటి స్మార్ట్ యుగంలో మన పని అంతా కంప్యూటర్, లాప్టాప్ స్క్రీన్స్ చూడడమే సరిపోతుంది.. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండనే ఉంటుంది.. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే కంటి నిండా కునుకే వేయలేరు.. ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల ఆ బ్లూ లైట్ మన కంటి పై ప్రభావం చూపుతుందని చాలామందికి తెలుసు.. కానీ ఎండలో ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని మీకు తెలుసా.!?
జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం పగటిపూట ఎండలో తదేకంగా ఫోన్ చూడటం వల్ల ఒక యువతి తన కంటి చూపు కోల్పోయినట్లు ప్రచురించబడింది. ఫోన్ స్క్రీన్ పై సూర్యుని శక్తివంతమైన కాంతి పడటం వల్ల అది రెటీనాకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. దానివల్ల ఆమె కంటిచూపు కోల్పోయింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీ సోలార్ మక్యూలోపతి బాధపడుతున్నట్లు గుర్తించారు. వాళ్ళిద్దరూ తమ ఫోన్స్ ఎక్కువగా పగటివేల ఎండలో చూడటం వల్ల కళ్ళు దెబ్బతిన్నాయి.. మక్యూలోపతి అనేది మక్యూల అని పిలవబడే రెటీనా వెనుక భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి.. మక్యూలోపతి ఉన్నవారు పూర్తిగా అందులుగా మారరు కానీ తరచుగా వారి కేంద్ర దృష్టిని కోల్పోతారు..
సూర్యరశ్మికి నేరుగా గురికావడం వల్ల రెటీనా మక్యూల దెబ్బతింటుంది. దాంతో కంటి చూపు సమస్య ఉన్న ఆ యువతి ఎదురుగా కనిపించే ఆకారాలను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడింది.. ఆ రిపోర్ట్స్ ప్రకారం కంటిచూపు పాక్షికంగా కోల్పోయిన ఆ యువతీ వయసు 20 సంవత్సరాలు. ఆమె ఎక్కువగా బీచ్ లో ఎండగా ఉన్నప్పుడు తన మొబైల్ వాడటం వల్ల ఇలా జరిగింది. ఇక మరొక వ్యక్తి ఎండలోని గంటల తరబడి తన ట్యాబ్ చూస్తూ గడిపాడు.. దానివల్ల అతని కళ్ళు కూడా దెబ్బతిన్నాయి..