Trinayani March 16 2024 Episode 1190: దీని మాటలు వింటుంటే వాంతుకొస్తుంది కానీ ఇది ఎందుకు నెల తప్పుతుంది బాబు గారు పదండి అని నైని విశాల్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ మాట చాలే నువ్వు చావడానికి అంటూ విక్రాంత్ వెళ్లిపోతాడు. నేను ఇలా ఎందుకు మాట్లాడను ఇప్పుడు మీకు అర్థం కాదండి అని సుమన అనుకుంటుంది. కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు.ఏం జరిగింది తిలోత్తమ అఖండ స్వామి అంటాడు.స్వామి మాకు వినిపించదు నిన్నటి నుంచి మా చెవులు పనిచేయడం లేదు అని తిలోత్తమ అంటుంది. ఎందుకలా జరిగింది అని అఖండ స్వామి అంటాడు. ఎందుకలా జరిగిందని మీరు అడుగుతున్నారేమో నిజం తెలుసుకుందామని ఒక ప్లాన్ వేసాం అది రివర్స్ అయ్యి మాకే తగిలింది మాకు చెవులు వినపడడం లేదు అని తిలోత్తమ అంటుంది.
మీరే ఏదో ఒకటి చేసి మాకు చెవులు వినిపించేలా చేయండి అని తిలోత్తమ అంటుంది. అర్థమైంది అంటూ అఖండ స్వామి వాళ్ళిద్దరూ చెవుల్లోఏదో పసరు పోస్తాడు.వల్లభ చెవుల మీద రెండు సార్లు కొడతాడు అఖండ స్వామి. మమ్మీ ఇప్పుడు నీ వంతు అని వల్లభ అంటాడు. తిలోత్తమ చెవుల మీద కూడా కొడతాడు అఖండ స్వామి. మమ్మీ ఇప్పుడు చెవులు బాగా పనిచేస్తున్నాయని వల్లభ అంటాడు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు. స్వామి లలితా దేవి అక్కయ్య గాయత్రి పాప పేరు మీద ఆస్తినంతా రాస్తుంది అని తిరోత్తమ చెబుతుంది. ఎందుకలా చేస్తున్నావ్ అని మీరు అడగలేదా అని అఖండ స్వామి అంటాడు. అడిగితే గాయత్రి పేరు చివరన దేవి తగిలిస్తే ఈ పాపే గాయత్రీ దేవిగా చలామనవుతుందని ఆస్తినంతా ఆ అనాధ పిల్ల పేరుట రాస్తానంటుంది అని తిలోత్తమ చెబుతుంది. అయితే ఆ గాయత్రి పాప ఎవరో తెలుసుకోండి అని అఖండ స్వామి అంటాడు. ఎలా స్వామి అని తిలోత్తమ అంటుంది.
లలితా దేవి రక్తంతో గాయత్రి పాపకి ఆవిడకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవచ్చు అని అఖండ స్వామి అంటాడు. అయితే లలితా దేవి అక్కయ్యకి అయ్యే గాయంతో అనాధ పిల్ల ఆయన గాయత్రీ కి ఆస్తినంత రాయాలన్న ఆలోచన మర్చిపోయా ఎలా చేస్తాను అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, హాసిని వాళ్లకి చెవులు వినపడని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నేను ఆయనను తిడుతుంటే తెల్ల మొహం వేసుకుని నన్ను తిట్టవా అన్నట్టు చూస్తావేంటే నీ మొహం తగలెయ్య అని తిలోత్తమని అంటుంది హాసిని. నీకు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదా అని తిలోత్తమ అంటుంది. అత్తయ్య మీకు చెవులు వినపడుతున్నాయా అని హాసిని అడుగుతుంది. తిలోత్తమ హాసిని చంప పగలగొడుతుంది. ఏంటే మాకు చెవులు వినపడడం లేదని నన్ను రారా పోరా అని పోకిరి మాటలు మాట్లాడతావా ఉండవే నీ సంగతి చెప్తాను అంటూ వల్లభ హాసిని జుట్టు పట్టుకుంటాడు. అయ్యో వీళ్ళకు వినపడి చస్తుందా నేను తొందరపడ్డానే అని హాసిని రాజా కింద పడితే మాత్రం నన్ను అనొద్దు అని వల్లభని నెట్టేస్తుంది. పారిపోతున్న హాసిని నీ తిలోతమ పట్టుకుంటుంది.
అత్తయ్య తప్పైపోయింది క్షమించండి ఇంకోసారి ఇలా చేయను అని హాసిని ప్రాధేయపడుతుంది. వీళ్లకు చెవులు వినిపిస్తున్నాయని అందరికీ చెప్పాలని తిలోత్తమని కూడా పక్కకు నెట్టేసి పారిపోతుంది హాసిని. కట్ చేస్తే, ఏదో నూరు జారి అన్న నే ఊరుకో అందరి ముందు బయట పెట్టకు అని దురంధర ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావ్ పిన్ని? నాతో చెప్పిందే అందరితో చెప్పొచ్చు కదా అని సుమన అంటుంది. ఏమన్నావ్ పిన్ని అని హాసిని అడుగుతుంది. ఏదో నోరు జారనులే అని దురంధర అంటుంది. నా భార్యని మీ అక్క చెల్లెల గొడవలోకి లాగకండి అమ్మ అని పావన మూర్తి అంటాడు.మామయ్య అత్తయ్య ఏమన్నదో చెబితే కదా తెలిసేది అని విశాల్ అంటాడు. అత్తయ్య మీరు ఏమన్నారు భయపడకుండా చెప్పండి అని విక్రాంత్ అంటాడు. ఏమీ లేదు విష్ లలితా దేవి వదిన గాయత్రి పిల్ల పేరు మీద ఆస్తినంతా రాయడం ఎందుకు గానవి పేరుమీద రాస్తే బాగుంటుంది కదా అన్నాను అంతే దానికి సుమ్మి ఇంత పెద్ద గొడవ చేస్తుంది అని దురంధర అంటుంది.
దురంధర చెప్పింది కరెక్టే ఇంతమంది పిల్లలు ఉండగా అనాధ పిల్ల అయిన గాయత్రీ పేరుమీద ఆస్తులు ఎందుకు రాయాలనుకుంటుంది లలితా దేవి అక్క అని అడుగుతుంది తిలోత్తమ. అరే సుమన అన్న దాంట్లో కూడా తప్పేముంది అని వల్లభ అంటాడు. చెప్పు అక్క గాయత్రీ పాప పేరు మీదనే ఎందుకు ఆస్తిరాలనుకుంటున్నారు గానవి ఉంది తన పేరు మీద రాయొచ్చు కదా అని సుమన అంటుంది.పెద్దమ్మ గారు అన్నాక విశాల్ బాబు మాట ఇచ్చాడు ఇంక నేను చేసేదేముంది అని నైని అంటుంది. అంతేకానీ నీ కూతురు అన్యాయం అయిపోతుందని అడగవా అక్క అని సుమన అంటుంది. అరె గాయత్రీ పెద్దమ్మ తిరిగి వస్తే తనకు ఏమిస్తారు అని వల్లభ అంటాడు. తను తిరిగి వస్తే తనకు పాతిక కోట్ల ఆస్తి ఉంది కదా అదే ఉంటుంది అని విశాల్ అంటాడు. అర్థమైంది మీ ప్లాన్ అంతా అంటే ఆస్తి అంతా అనాధ పిల్ల పేరు మీద రాస్తే సుమనగాని నా పెళ్ళాం గానీ మళ్లీ నెలతప్పి బిడ్డల్ని కంటే ఆస్తిని అడగకూడదని ఆ అనాధ పిల్లల పేరు మీద రాస్తున్నారా అని వల్లభ అంటాడు.మీరు రెండో బిడ్డని కనడానికి మనసు పెట్టడం లేదు కదా అని డమ్మక్క అంటుంది.
నిన్ను చూస్తే ఇంకో బిడ్డను కూడా కణాలని అనిపిస్తుందా అని హాసిని అంటుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ వదిన అని విక్రాంత్ అంటాడు. చూడక్క ఆస్తి ఉలొచ్చి పేరుమీద నన్న రాయాలి గానవి పేరు మీద నాన్న రాయాలి అంతేకానీ ఈ ఆస్తి నంతటికి ఆ అనాధ పిల్లని అధినేతగా చేస్తానంటే నేనొప్పుకోను అని సుమన అంటుంది. ఎప్పుడూ ఆస్తి డబ్బులు అనే గొడవ చేస్తావు ఉలోచి ఎక్కడ గాయత్రీ ఎక్కడ ఏం మాట్లాడుతున్నావ్ చిట్టి అని హాసిని అంటుంది. అయితే ఈ మాట పెద్దమ్మ గారు వచ్చినప్పుడు కూడా చెప్పు చెల్లి అని నైని అంటుంది.ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు దురంధర అత్తయ్య తన అభిప్రాయం చెప్పింది అని విశాల్ అంటాడు. ఏ సుమ్మి నీ గొడవలోకి నన్ను లాగకే అని దురంధర అంటుంది. పిన్ని నాతో చెప్పిన మాటే పెద్ద అత్తయ్యతో చెప్పండి భయపడతారు ఎందుకు మీరు నాకు వత్తాసు పలికితే చాలు అని సుమన అంటుంది. ఎవ్వరు పలకరు అని హాసిని అంటుం
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!