మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. వాటికి ఏ మాత్రం సమస్య వచ్చినా శరీరం యొక్క ఆరోగ్యం గతి తప్పుతుంది. ఎందుకంటే.. శరీరానికి పోషకాలు అందించి, విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలుకిడ్నీలు.
రక్తాన్ని శుద్ధి చేసి,శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. అలాంటి కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు ఈ ఆహారాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం. మరి, అవేంటో చూసేద్దామా! కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంలే రోజు క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. నీరు శరీరాన్ని డీహైడ్రేషన్కు కాకుండా రక్షిస్తుంది. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చనేది నూటికి నూరు పాళ్లు నిజం. ఆపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్-B, విటమిన్-D కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి.లావుగా ఉండే ఎర్రటి మిర్చీలో విటమిన్-A, విటమిన్-C ఉంటాయి. ఇవి ఆక్సిడెంట్లలా పని చేస్తాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది.
వెల్లులితో శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపేందుకు వెల్లులి తోడ్పడుతుంది. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేందుకు సహకరిస్తాయి. ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు ఓట్స్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో ‘బీటా గ్లూకాన్’ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. కాలిఫ్లవర్లో విటమిన్ K, విటమిన్ C, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. కాలిఫ్లవర్లో ఉండే సల్ఫర్, పొటాషియం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేస్తాయి. ఫలితంగా కిడ్నీల పని తీరు మెరుగవుతుంది..