Grapes juice: ఆరోగ్యం బాగాలేనపుడు చాలామంది మామ్మూలుగా వేడి నీళ్లతో ట్యాబ్లెట్లు వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే చాలా అరుదుగా కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు జ్యూస్లు తీసుకుంటారు. కానీ ఇది అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని కూడా చెబుతున్నారు. ఎందుకంటే, జ్యూస్తో పాటు ట్యాబ్లెట్లు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గిపోతుందట. అంతేకాకుండా అలర్జీ వంటివి కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Red Grapes: ఈ కలర్ ద్రాక్ష పండ్లు తింటే ఈ సమస్యలు దూరం..!!
Grapes juice: మరీముఖ్యంగా ఇలాంటి జ్యూస్లతో అస్సలు తీసుకోకూడదు!
మరీముఖ్యంగా ఇలాంటి జ్యూస్లతో అస్సలు తీసుకోకూడదట. అవేమంటే, ద్రాక్ష, నారింజ, ఆపిల్ జ్యూస్. అవును.. ఎందుకంటే, ద్రాక్ష రసం రక్తప్రవాహంలోకి వెళ్లి ఔషధాల ప్రభావాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు, గుండె వ్యాధులు ఉన్నవారు ద్రాక్ష రసంతో పాటు ట్యాబ్లెట్లు అస్సలు వేసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇక్కడ ఇంకో విషయం ఏమంటే.. నారింజ, యాపిల్, ద్రాక్ష రసాలతో క్యాన్సర్ మందులని తీసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.
Dry Grapes: ఎండు ద్రాక్ష తో చర్మాన్ని మెరిపించచ్చు..!!
ట్యాబ్లెట్లు ఎప్పుడూ ఇలాగే తీసుకోవాలి!
ఔషధాలను ముఖ్యంగా నీటితో తీసుకుంటేనే ఉత్తమం అని చెబుతున్నారు వైద్యులు. ఇక్కడ అందరూ తెలుసుకోవలసింది ఏమంటే, కొద్దిపాటి నీళ్లతో ట్యాబ్లెట్లు వేసుకుంటే అవి శరీరంలో సరిగా కరగవు. అందుకే ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. అలాగే చల్లటి నీటితో ఔషధాలను తీసుకోవడం కూడా అంత మంచిది కాదని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లటి నీళ్లతో ట్యాబ్లెట్లు తీసుకున్నవారిలో అవి విచ్ఛిన్నం కావడానికి సుమారు 40 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఈ విషయాలు అందరూ పరిగణనలోకి తీసుకోవాలి.