Dates: ఖర్జూరం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. 100 గ్రాముల ఖర్జూరంలో 250 క్యాలరీస్ అందుతాయి.. ఇది త్వరగా జీర్ణం అవుతుంది.. మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.. ఇందులో మెడిసినల్ విలువలు పుష్కలంగా ఉన్నాయి.. ఫ్రొక్టోస్, డెక్స్ ట్రోస్ తో పాటు విటమిన్ ఏ, బీ లను కూడా కలిగి ఉంది.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.. ఖర్జూరాలలో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.. ఇందులో అండ్ ఆక్సిడెంట్ కూడా ఉన్నాయి.. వీటిని తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!
షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే తప్పకుండా ఆహారాల్లో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో ఉండే మూలకాలు చక్కని స్థాయిని నియంత్రిస్తాయి.. అయితే రోజుకు మూడు ఖర్జూరాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు.. అంతకుమించి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి.. ఖర్జూరంలో పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు దూరం అవుతాయి.. గుండె జబ్బులు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి.. ఖర్జూరంలో కాపర్, మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి.. ఇవి ఎముకలను దంతాలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి.. ఎర్ర రక్తకణాలు ఉత్పత్తికి కాపర్.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి..
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే పరగడుపున వాటిని తిని ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.. ఖర్జూరాలను పాలలో వేసి నానబెట్టి వాటిని తింటే పిల్లలకు చాలా బలం.. అలాగే పిల్లలు ఎక్కువగా మూత్ర విసర్జన చేయకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది.. ఖర్జూరాలను తేనెలో నానబెట్టుకుని తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.. అలాగే పిల్లలలో రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది..