మన శరీరంలో ప్రధానమైన వ్యవస్థలలో అస్థిపంజర వ్యవస్థ ఒకటి. అస్థిపంజర వ్యవస్థ మన శరీరానికి ఆకృతిని, రక్షణ కల్పిస్తుంది. మన శరీరం సుమారు 206 ఎముకలతో నిర్మితమై అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాంటి ఎముకల ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మన శరీరంలో అన్ని విధులు సక్రమంగా నిర్వహించబడతాయి. సాధారణంగా ఎముకలు మధ్య వయస్సు వరకు అంటే, 30 సంవత్సరాల వరకు పెరుగుదల ఉంటుంది. తర్వాత ఎముకలు స్థిరంగా ఉండి వయసు పెరిగే కొద్దీ ఎముకలో క్యాల్షియం, పాస్పరస్ నిలువలు తగ్గడంతో ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. ఎముకలు బలహీనపడితే కీళ్ల నొప్పులు , నడుము నొప్పి, వెన్ను నొప్పులు ,ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ప్రస్తుత కాలంలో మానవుని జీవన శైలిలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు , నడుము నొప్పులు, మొదలగు ఎముక అరుగుదల సమస్యలతో బాధ పడుతున్నారు , దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి నిద్ర, ఆహారం తీసుకోలేకపోవడం . జింక్ ఫుడ్స్ తీసుకోవడం ,కాఫీ టీలు ఎక్కువగా తాగడం ఇలా చాలా కారణాలు ఉంటాయి. దీన్ని అధిగమించడానికి చిన్న వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎముకల పటుత్వాన్ని పెంచుకుని శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చ. ఎముకలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా సంతోషకర జీవితాన్ని పొందవచ్చు.
ఎముకలు దృఢంగా ఉండాలంటే మన నిత్య ఆహారంలో క్యాల్షియం తప్పనిసరిగా , రోజుకు కనీసం 1 గ్రాము కాల్షియం అవసరం అవుతుంది. పాలలో అధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది రోజుకు ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది.
చిరు ధాన్యం అయిన రాగులు లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది,దీనిని రాగి మాల్ట్ లేదా రాగి జావ రాగి ముద్ద రాగి రొట్టె మన ఆహారంలో తప్పని సరి చేసుకోవాలి .తద్వారా ఎముకలకు కావలసిన క్యాల్షియం వృద్ధి చెందుతుంది. ప్రతిరోజు నారింజ, అంజీర పండు( డ్రైఫ్రూట్) అయినా సరే, బత్తాయి, సపోటా పండ్లను ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాల్షియం సమృద్ధిగా లభించడంతో పాటు మన శరీరానికి అవసరమైన C విటమిన్ ఉంటుంది.C విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజుకు కొన్ని బాదం పప్పులను నానబెట్టుకుని ఉదయం తీసుకుంటే శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. బెల్లంతో తయారు చేసే వేరుశనగ చిక్కి, నువ్వుల చిక్కి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది .
ఎముకలు దృఢం గా ఉండాలంటే క్యాల్షియం తో పాటు విటమిన్ D కూడా చాలా అవసరం. విటమిన్ D లభించే పదార్థాలైన కోడిగుడ్డు, చేపలు, చికెన్ , బెల్లంతో తయారు చేసిన వంటకాలు, లివర్ మొదలైన ఆహారంలో D సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ఆహారంలో ఈ విభాగం కావాలి. ఆహారంతో పాటు ఉదయం, సాయంత్రం వ్యాయామం నడవడం వంటివి చేస్తే మరీ మంచిది ఇలా చేయడం వల్ల సూర్యరశ్మిలో సహజ సిద్ధంగా లభించే విటమిన్D కూడా లభిస్తుంది. తద్వారా వృద్ధాప్యంలో కూడా క్యాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలు దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.
మరీ తీవ్రమైన వెన్నునొప్పి నడుము నొప్పి తో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం.