బ్రేక్ఫాస్ట్ అనేది మన రోజులో అతి ముఖ్యమైనది. దీన్నిమానేయడం వంటివి చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ ని ఆరోగ్యకరంగా ఎంచుకోవాలని కోరుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోంది. బ్రేక్ఫాస్ట్ లో పోషకాలుండేలా చూసుకోవాలని ఆరోగ్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా ప్రోటీన్ గురించే మాట్లాడుకోవాలి.
బ్రేక్ఫాస్ట్ లో జొన్న పిండికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ప్రోటీన్స్ తో పాటు మరెన్నో పోషకాలు కూడా లభిస్తాయి. న్యూట్రిషయన్స్ చెప్పిన దాని ప్రకారం జొన్న పిండిలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. ఐరన్, కాపర్, పొటాషియం మరియు ఫాస్ఫరస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. జొన్నపిండి డైజెషన్ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. ఎంతో రుచిగా ఉండే జొన్న పిండి దోస ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ..
1కప్పు జొన్న పిండి 1 కప్పు బియ్యపు పిండి 1 పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి 1 చెంచా జీలకర్ర ,కొంచెం కర్వేపాకు 50 గ్రా నూనె తీసుకోవాలి … ముందు గా ఒక గిన్నెలో జొన్న పిండి ,బియ్యపు పిండి వేసి తగినంత ఉప్పు వేయాలి. ఉల్లిపాయని సన్నగా తరిగి పిండి లో వేయాలి . ఇప్పుడు కరివేపాకు ,జీలకర్ర పచ్చిమిరపకాయలు పేస్ట్ గా చేసుకుని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో 3 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి . పెనం పెట్టి బాగా వేడి అయ్యాక పిండిని పెనం మీద రవ్వ దోసకు పోసినట్టుగా పోయాలి …దానిమీద కొంచెం నూనె వేసి అట్టు కాలినతరువాత మరో వైపు తిరగేసుకోవాలి .. దోసెలు అయ్యేవరకు పిండి చిక్కపడకుండా నీళ్లు కలుపుతూ పలచన చేసుకుంటూ అడుగువరకు పిండిని కలుపుతూ దోశలు వేసుకోవాలి … అంతే జొన్నదోసలు రెడీ .. ఈ జొన్న దోసెలు పొదినా పచ్చడి తో తింటే రుచికి రుచి .. ఆరోగ్యానికి ఆరోగ్యం ..