Breaking: రాజస్థాన్లో దారణ ఘటన చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుండి కాపాడాల్సిన అంబులెన్స్ సిబ్బంది కామంతో కళ్లు మూసుకుపోయి ఓ మహిళపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఆకలితో ఉన్న ఓ మహిళకు అన్నం పెడతామని తీసుకువెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని డుంగ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
విషయం ఏమిటంటే.. జైపూర్ ఆసుపత్రి వద్ద ఓ మహిళ (22) ఆకలితో అలమటిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్, అతని సహాయకుడు భోజనం పెట్టిస్తామంటూ ఆమెను అంబులెన్స్ ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.