బీహార్ ముఖ్యమంత్రి. జేడీయూ నేత నితీశ్ కుమార్ రీసెంట్ గా ఎన్డీఏకి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తానేమిటో చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నితీశ్ కుమార్. బీజేపీ వ్యతిరేక పక్షాలతో చేతులు కలిపి కేంద్రం రాజకీయాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ సీఎం కేటిఆర్ తోనూ రీసెంట్ గా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ తరుణంలో నితీశ్ నేతృత్వంలో జేడీయుకు మణిపూర్ లో బిగ్ షాక్ తగిలింది.
మణిపూర్ లో అసెంబ్లీలో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో అయిదుగురు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులైయ్యారు. జెేడియూపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరారు. తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామంటూ అయిదుగురు జేడీయు స్వీకర్ కు తెలిపారు. వారి విజ్ఞప్తిని స్వీకర్ ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి మేఘజిత్ సింగ్ ప్రకటించారు. ఈశాన్య ప్రాంతంలో నితీశ్ కుమార్ పార్టీ (జేడియూ) ఎమ్మెల్యేలను బీజేపి టార్గెట్ చేయడం ఇది రెండో సారి. 2020లో అరుణాచల్ ప్రదేశ్ లోని ఏడుగురు జేడీయు ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరారు. గత వారం ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరిపోయారు.
బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్ .. బీజేపీ సభ్యుల వాకౌట్
మణిపూర్ లో ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు 38 స్థానాల్లో పోటీ చేసినా ఆరు నియోజకవర్గాల్లోనే గెలుచుకుంది. ప్రస్తుతం జేడీయూ ఎమ్మెల్యేలైన జోయ్ కిషన్ సింగ్, ఎన్ సనాతే, ఎండి అచాబ్ ఉద్దీన్, ఎల్ ఎం భౌటే, తంజాయ్ అరుణ్ కుమార్ బీజేపీలో చేరారు. ఎల్ఎం భౌటే, తంజామ్ అరుణ్ కుమార్ గతంలో బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు కానీ ఆ పార్టీ టికెట్ లు ఇవ్వకపోవడంతో జేడీయూలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచారు. నితీశ్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఆర్ జే డీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో జత కట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.
తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్