Sushant Singh Rajput case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో నేడు మరో అరెస్టు జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబీ) అధికారులు ఈ రోజు మరొక వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు. వారం రోజల క్రితం హైదరాబాద్ లో సుశాంత్ సన్నిహితుడైన సిద్ధార్ధ్ పిథానీ ని అదుపులోకి తీసుకున్న ఎన్సిబీ అధికారులు తాజాగా బుధవారం సుశాంత్ కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ షాక్ ను ముంబాయిలోని బాంద్రా లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ విచారణలో అతను పలువురు ప్రముఖులకు మారద దవ్యాలను సరఫరా చేసే వాడని తేలిసింది.
దీనిపై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామనీ, ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. హరీశ్ ఖాన్ సెల్ ఫోన్ లో, వాట్సాప్ చాటింగ్ లలో డ్రగ్స్ సరఫరాదారులతో లింకులు ఉన్నట్లు తేలడంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, గత సంవత్సరం జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అతని స్నేహితురాలు, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసి విచారించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Maharashtra | Narcotics Control Bureau (NCB) arrested one Harish Khan, a drug peddler in Bandra in the drugs case linked to late Bollywood actor Sushant Singh Rajput: NCB
— ANI (@ANI) June 2, 2021
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!