26/11 Mumbai Attacks: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజు ముంబైలోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడికి యావద్దేశంతో పాటు ప్రపంచం ఉలిక్కిపడటం జరిగింది. లష్కరే తోయిబాకి చెందిన పదిమంది ఉగ్రవాదులు.. జరిపిన దాడుల్లో.. పలువురు అమెరికన్ లతో సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై26/11 భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ దాడిలో పాల్గొన్న పదిమంది ఉగ్రవాదులలో 9 మందిని అక్కడికక్కడే భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ప్రాణాలతో పట్టుపడ్డ కసాబ్ నీ అనంతరం ఉరి తీయడం జరిగింది.
ముంబై26/11 సూత్రధారి పాక్ లోనే…
కానీ ఈ దాడికి సూత్రధారి హాఫిజ్ సయ్యద్ మాత్రం.. పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అయితే ఈ దాడి జరిగి నేటికి 14 సంవత్సరాలు కావస్తున్నా గాని.. దాడిలో గాయపడ్డ బాధిత కుటుంబాలకు ఇప్పటికీ కూడా సరైన న్యాయం జరగలేదు. ఈ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ.. ఉన్న క్రమంలో వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే భాదిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్ ట్విట్టర్ లో తెలియజేశారు. ముంబై26/11 ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తికి పాక్ శిక్ష వేయకపోవడం పై ఇప్పటికీ కూడా భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. సముద్ర మార్గం గుండా బోటు ద్వారా ముంబైకి చేరుకున్న ఈ ముష్కరాలు.. టాక్సీలలో ఇంకా రెస్టారెంట్ లలో మరియు రైల్వే స్టేషన్ లో చేసిన మరణ హోమానికి.. చాలామంది అమాయకులు బలైపోయారు. తాజ్ హోటల్ లో తొమ్మిది మంది ఉగ్రవాదులు.. విచక్షణ రహితంగా జరిపిన కాల్పులకి.. దేశం మొత్తం భయాందోళనకు గురైంది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. హైలెట్ ఆపరేషన్..
ఈ క్రమంలో ఉగ్రవాదులను నిర్మూలించడానికి బ్లాక్ కమాండోస్ రంగంలోకి దిగి.. ఆపరేషన్ నిర్వహించి దాదాపు 60 గంటలు కష్టపడి ఉగ్రవాదులను మట్టు బెట్టారు. ఈ ఆపరేషన్ లో NSG కమాండోలు.. చేసిన ఆపరేషన్ అతిపెద్ద హైలెట్. వీళ్ళని ముందుకు నడిపించడంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కీలక పాత్ర పోషించాడు. ఒక్కడే ఉగ్ర మూకలపై దాడి చేస్తూ… మిగతా కమాండోస్ కి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్లకి ఆదేశాలు ఇచ్చి ఉగ్రముకలపై కాల్పులు జరిపి వీర మరణం పొందాడు.దాదాపు 60 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లో కసబ్ మినహా మిగతా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు బెట్టింది. ఏకే 47 తుపాకులతో ముంబై వీధులలో.. రెస్టారెంట్లలో.. వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు జరిపి బాంబులు మోత మోగించారు. కొన్ని టాక్సీలలో బాంబులు కూడా పెట్టడం జరిగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మరణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. భారతీయులు కాకుండా ఇతర దేశాలకు చెందిన 14 మంది పౌరులు కూడా మరణించడం జరిగింది.
రాష్ట్రపతి నివాళి
ఈ క్రమంలో ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వం ముంబై26/11 దాడుల సూత్రధారిని.. పాకిస్తాన్ ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకువచ్చి శిక్షించాలని కోరుతూ ఉంది. ఇదిలా ఉంటే దాడులు జరిగే ముంబై26/11 దాడులు జరిగి 14 సంవత్సరాల అవుతున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నివాళులు అర్పించారు. “ఏ ఉగ్రవాదుల దాడులలో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఇది నిర్వహణలో భాగంగా ధైర్యంగా పోరాడి ఎంతోమంది భద్రతా సిబ్బంది కూడా తమ ప్రాణాలు త్యాగాలు చేశారు. వారి త్యాగాలను దేశం స్మరించుకుంటుంది. మృతులకు నివాళులు అర్పిస్తుంది.. అనే ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Terrorism threatens humanity.
Today, on 26/11, the world joins India in remembering its victims. Those who planned and oversaw this attack must be brought to justice.
We owe this to every victim of terrorism around the world. pic.twitter.com/eAQsVQOWFe
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 26, 2022
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?