ఎంతో రసవత్తరంగా సాగుతున్నబిగ్ బాస్ 4 ఇంట్లో ఆనందాలు వెళ్లువిరుస్తున్నాయి. 74 ఎపీసోడ్ లో భాగంగా ఇంట్లో వాళ్లందరిని సంతోషింపచేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. అదేంటనుకుంటున్నారా… అదేనండి బిగ్ బాస్ ఇంట్లో వచ్చిని కంటెస్టెంట్లు తమ పేరెంట్స్ ను మిస్సవుతున్నామనే బాధకలగకుండా ఇంటి సభ్యులకు వాళ్ల పేరెంట్స్ ను ఇంటికి తీసుకువచ్చాడు.
ఇంకే ముంది ఒక్కరుగా వస్తున్న కుటుంబసభ్యులను చూసి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఆ నందంలో వారు ఎమోషన్ కూడా అయ్యారు. ఇక పోతే బిగ్ బాస్ హౌస్ నవ్వుల పువ్వులు పూయిస్తున్న అవినాశ్ అమ్మ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన కొడుకుని చూసి మురిసిపోయింది మల్లవ్వ. అలాగే ఇంట్లో అందరూ మంచిగా మెలగాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పింది.
అలాగే నువ్వు మంచిగా ఆడు నాన్న నువ్వంటే చాలా ఇష్టం నా నాన్న అంటూ ఆమె తన కొడుకుతో సరదాగా గడిపింది. అలాగే ఆమె మిగతా కంటెస్టెంట్లతో కూడా సరదాగా మట్లాడి మా ఇంటికి వస్తే మీకు మటన్ కూర వండిపెడతానని తన ప్రేమను తెలిపింది. దానితో పాటుగా ఆమె వారందరినీ ఆనందంగా ఉంచడానికి స్టెప్పులు కూడా వేసేసింది. కాగా రెండు మోకాళ్లు అరిగి ఆ బాధతో ఉన్న తన తల్లి మామూలుగా ఉండటాన్ని చూసి అవినాశ్ చాలా సంతోషించాడు.
అలాగే ఇక్కడ ఎప్పుడూ పెళ్లి పెళ్లి అని గొడవచేస్తున్నావ్ కదా బయటకు రాగానే నీకు తొందరగా పెళ్లి చేసేస్తానని ఆమె అవినాశ్ కు మాటిచ్చేసింది. ఇంకేముంది ఆ ఒక్క మాటతో అవినాశ్ దిల్ ఖుశ్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. కాగా తన తల్లిపడుతున్న బాధను అవినాశ్ అరియానాతో పంచుకున్నాడు. అయితే మొత్తంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల రాకతో అదో ఆహ్లాదకరమైన వాతావరణంగా మారిపోయింది.