టాలీవుడ్ లో మళ్ళీ శృతి హాసన్ ఫాం లోకి వస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్, కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ – కాటమరాయుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న శృతిహాసన్ ఆ తర్వాత టాలీవుడ్ లో కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. రాం చరణ్, అల్లు అర్జున్, రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు ..ఇలా టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి.
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ లో కూడా శృతిహాసన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే చాలా తక్కువసేపే సినిమాలో నటిస్తుందట. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ మాత్రమే చేస్తుందని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. 2021 సంక్రాంతి రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇక ప్రస్తుతం శృతిహాసన్ మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా నటించిన శృతిహాసన్ ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పాలి. ఇక రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని తో తెండవ సారి కలిసి పని చేసిన క్రాక్ సక్సస్ శృతిహాసన్ తో పాటు రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా కీలకం.
అలాగే హిందీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ లో శృతిహాసన్ కియారా అద్వానీ నటించిన పాత్రలో కనిపించనుందట. ఈ వెబ్ సిరీస్ లో రానాకు జోడీగా కనిపించబోతుందని సమాచారం. ప్రస్తుతం రానా, శృతి హాసన్ కలిసి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఒక వైపు వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేస్తూనే మరో వైపు పవన్ కళ్యాణ్, రవితేజ ల సరసన సినిమాలు చేస్తోంది. చాలాకాలానికి శృతి మళ్ళీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోబోతోంది.