ఢిల్లీ, జనవరి 11: సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో పాటు క్రిమినల్ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిందేననీ, పది రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది.
మాంసం ఎగుమతి దారు మొయిన్ ఖురేషి కేసులో తనను తప్పించేందుకు ఒక మధ్యవర్తి ద్వారా రాకేష్ ఆస్థానాకు తాను లంచం ఇచ్చినట్లు హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త సతీష్ బాబు వాగ్మూలం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై రాకేష్ ఆస్థానా, సిపిఐ డిప్యూటి ఎస్పి దేవేందర్ కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు తిరస్కరించింది.